Movies: ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వచ్చిందంటే సినిమా సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు ఏకంగా సంక్రాంతి బరిలో తమ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అయితే ఫెస్టివల్ సీజన్ తో పాటు సెలవులు కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, యువత కూడా సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ కారణంగానే సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసుకొని స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలా రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి.
ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి వంద కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో, చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తుంది. చాలా కాలం నుంచి టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథలు రావడం లేదు. వచ్చిన సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ లేక డిజాస్టర్ అవుతున్నాయి.
అయితే ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన రెండు సినిమాలు పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాలుగానే ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. బాలయ్య నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశించి సినిమాకి వెళ్తారో అవన్నీ పుష్కలంగా వీరసింహారెడ్డి సినిమాలో ఉన్నాయి. పవర్ ఫుల్ మాస్ ఎలివేషన్ సన్నివేశాలతో పాటు ఈ సారి పవర్ ఫుల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా వీరసింహారెడ్డి మూవీలో ఉండటం విశేషం. సినిమాలో బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్ రోల్ పోషించాడో అంతే స్థాయిలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా ఉండటం విశేషం. కామన్ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి ఎవరేజ్ రెస్పాన్స్ వస్తుంది.
Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
This website uses cookies.