Rakhi Pournami: ప్రతి ఏడాది రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ వేడుకను జరుపుకుంటారు ఈ పండుగ రోజు అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారు ఏ విధమైనటువంటి ఆపదలలో ఉండకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా రాఖీ పండుగ రోజు తమ అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నా కూడా తమ సోదరుడికి రాఖి పంపిస్తూ ఉంటారు అయితే రాఖీ పండుగ రోజు ఈ రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు కూడా చాలా ముఖ్యం.
మరి పౌర్ణమి రోజు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే…పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ భద్రుడి ప్రభావంతో ఉంటుంది. భద్ర సమయం ఆగస్టు 19 మధ్యాహ్నం 2:21 గంటలకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30 గంటలకు భద్ర ముగుస్తుంది. దీని తర్వాత సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టగలరు. శ్రావణ మాసం పౌర్ణమి తేదీ ఆగస్టు 19 ఉదయం 3:03 గంటలకు ప్రారంభమై రాత్రి 11:54 గంటలకు ముగుస్తుంది. అందుకే ఉదయతిథి ఆధారంగా రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19న మాత్రమే జరుపుకుంటారు.
ఇక ఈ రాఖీ పండుగ రోజు కొన్ని నియమాలను కూడా పాటించాలి రాఖీ కట్టడానికి ముందు ఒక ప్లేటులో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. ఇక రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడు తూర్పు వైపుకు తిరిగి ఉండాలి అలాగే ఒక కుర్చీలోన లేదా పీట పైన కూర్చోనేలాగ ఏర్పాటు చేసుకోవాలి అంతే కాకుండా రాఖీ కట్టించుకునేటప్పుడు ఏ విధమైనటువంటి లేదా వస్తువులను మీ సోదరుడు ఉపయోగించకుండా చూసుకోండి.
ఇక రాఖీ కట్టేటప్పుడు పొరపాటున కూడా నల్ల దుస్తులను మీరు కానీ మీ సోదరుడు కానీ ధరించకూడదు. సోదరీమణులు పసుపు, ఎరుపు, గులాబీ రంగుల దుస్తులను ధరించాలి. శాస్త్రాల ప్రకారం పురుషులు, పెళ్లికాని అమ్మాయిలు తమ కుడి చేతికి రక్షాసూత్రాన్ని కట్టుకోవాలి. వివాహిత స్త్రీలు తమ ఎడమ చేతికి రాఖీ కట్టాలనే నియమం ఉంది. ఇలా రాఖీ కట్టిన తర్వాత మీ కన్నా వయసులో మీ సోదరుడు పెద్దవాడు అయితే తప్పనిసరిగా వారికి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.