Knee Pain: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.ఇలా చిన్న వయసులోనే చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడటం వల్ల చిన్న పని చేసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కారణంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నో మందులు వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. అయితే మందులు వాడిన మోకాళ్ళ నొప్పులు తగ్గని వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం తులసితో తయారు చేసిన టీ తాగటం వల్ల ఈ మోకాళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు.అదేవిధంగా ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఆవు పాలలోకి చిటికెడు పసుపు వేసి మరిగించి గోరువెచ్చని పాలను తాగటం వల్ల ఎముకలలో సాంద్రత పెరిగి ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనెను వేసి కొబ్బరి నూనెను చిన్న మంటపై మరిగించాలి. ఇలా నూనె మరుగుతున్న సమయంలో అదే కప్పుతో ఒక కప్పు అల్లం తురుము వేసి ఈ రెండింటిని బాగా వేడి చేసి వడపోసుకోవాలి.ఇలా వడపోసుకున్నటువంటి ఈ నూనెను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ప్రతిరోజు మోకాళ్లపై రెండు చుక్కల ఆయిల్ వేసి మర్దన చేయడం వల్ల ఈ నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.ఇలా ఈ చిట్కాలను పాటిస్తూ ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరలు కూరగాయలు చేపలు, గుడ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.