BJP: కర్ణాటకలో ఎన్నికల వేడి నడుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యకర్నాటక ఎన్నికలలో పోరు గట్టిగా నడుస్తోంది.అధికార పార్టీ బీజేపీ సారి భారీ మెజార్టీతో కర్ణాటక పీఠాన్ని అధిష్టించాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సిద్ధం అవుతోంది. మధ్యలో కుమారస్వామి జేడీఎస్ కూడా బలమైన స్థానాలలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజకీయ సర్వేల బట్టి మరల జేడీఎస్ కర్ణాటకలో ఎవరు అధికారంలోకి రావాలనేది డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉంటుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికలు బీజేపీకి మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
తరువాత ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి కర్ణాటక ఎన్నికలలో గెలుపు కూడా కొంత సానుకూలించే అంశం అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ ఆనుకొని కొన్ని జిల్లాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో బీజేపీ ప్రభావం పెరగాలంటే కచ్చితంగా కన్నడనాట గెలుపు తప్పనిసరి. తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా అగ్రెసివ్ మోడ్ లో వెళ్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ని నిలువరించడానికి బలమైన వ్యూహాలు వేసుకుంటూ బండి సంజయ్ టీమ్ దూసుకుపోతోంది. దీనికి తగ్గట్లుగానే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు కూడా ఉండటం విశేషం.
కొన్ని అంశాలు బీజేపీకి సానుకూలంగా మారితే మరికొన్ని బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఎన్నికలు ఈ సారి గట్టిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం కొంతలో కొంత అయిన ఏపీలో కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీపై ఏపీలో అంత సానుకూలత లేదు. అందుకే జనసేనాని కూడా వారి నుంచి దూరంగా వచ్చేసి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ నిర్ణయాలు కూడా మార్చుకొని ఏపీలో ఎన్నికలకి వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.