Kannappa: మంచు విష్ణు కి తీవ్రంగా గాయాలైనట్టు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ ఇలాగే షూటింగ్ సమయంలో విష్ణు గాయాలపాలైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడేమైంది..అసలు ఎందుకు గాయాలైయ్యాయో వార్తా సారాంశంలో చూద్దాం. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే టైటిలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ సర్కిల్స్ లో అందిన సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతోందట.
‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా నయనతార నటిస్తున్నారట. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నాఉ. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాద వశాత్తు డ్రోన్ కెమెరా వచ్చి విష్ణు మీద పడినట్టుగా సమాచారం. వెంటనే యూనిట్ సభ్యులు వచ్చి విష్ణుని పక్కకి లాగారట.
కొద్దిపాటి గాయాలైనట్టుగా తెలుస్తోంది. చిత్రీకరణ నిలిపివేసి యూనిట్ సభ్యులు మంచు విష్ణుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం. చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకి ఏమీ ప్రమాదం లేదని, చిన్నపాటి దెబ్బలే తగిలాయని.. అంతా బాగానే ఉందని చెప్పారట. దాంతో అటు మోహన్ బాబు ఫ్యామిలీ, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది.
మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా మంచు హీరోలకి హిట్ దక్కడం లేదు. అయినా ధైర్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వెనకాడటం లేదు. చూడాలి మరి కన్నప్ప సినిమాతో అయినా విష్ణు హిట్ అందుకుంటాడేమో.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.