AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మార్చి 14 జనసేన పార్టీకి చాలా కీలకంగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ దిశ, దశ ఏంటి అనేది ఆ రోజుతో ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. దీనికోసం మార్చి 11 నుంచి పవన్ కళ్యాణ్ మరల రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాడు. ఇక 11, 12, 13 తేదీలలో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో `అందుబాటులో ఉండటంతో పాటు పార్టీ నాయకులుతో కీలక అంశాలని పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎన్నికల కార్యాచరణ, అలాగే రూట్ మ్యాప్, ఎన్నికల హామీలకి సంబందించిన విషయాలపై ఆ మూడు రోజులు నాయకులతో పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారని తెలుస్తుంది.
అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్న జనసేన బలంపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నాడు. ఇప్పటికే టీడీపీతో పొత్తు అనధికారికంగా ఖాయం అయ్యిందనే ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తుంది. సీట్ల ఒప్పందం కూడా జరిగిపోయిందని టాక్. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా నష్టమే తప్ప లాభం ఉండదని కొంత మంది చెబుతున్న కూడా పవన్ కళ్యాణ్ తన ఆలోచనా విధానంతో వ్యూహాలు సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నారు.
ముందుగా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ ఉందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యం మార్చి 11 నుంచి కార్యాచరణ మొదలు పెట్టి మార్చి 14 తర్వాత గేర్ మార్చి తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొట్టు పెట్టుకున్న తనకున్న బలాన్ని నిరూపించుకోవాలి అంటే కచ్చితంగా పోటీ చేయబోయే నియోజకవర్గాలలో విస్తృతస్థాయిలో గ్రౌండ్ లెవల్ క్యాడర్ ని సిద్ధం చేసుకోవాలని కూడా చెబుతున్నారు. అలా జరిగితేనే స్థిరమైన, బలమైన రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగే అవకాశం ఉందనేది చాలా మంది మాట.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.