Categories: LatestNewsPolitics

Janasena: జనసేనాని కోసం సైనికుల అదిరిపోయే ప్లాన్

Janasena:  ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్  అండతో బీజేపీని ఏపీలో విస్తరించాలని మోడీ సేన ఆలోచిస్తుంది. అయితే జనసేన మాత్రం ప్రత్యామ్నాయ శక్తిగా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఉండాలని చూస్తుంది. ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ సభ ఈనెల 14వ తేదీన మచిలీపట్నం వేదికగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం ఇప్పటికే మచిలీపట్నంలో రైతులు భారీగా భూములు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ జనసేన నాయకులు సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ఫార్మేషన్ డే కోసం ఏకంగా ఐదు లక్షల మంది వస్తారని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు.

 

జనసేన ఆవిర్భావ సభతో పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల శంఖారావం మోగించబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంత బలంగా జనసేన బరిలోకి దిగుతుంది అన్నది ఆవిర్భావ సభ ద్వారా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తులతో కలిసి వెళ్తారా లేదా అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ సభ కోసం మంగళగిరి నుంచి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ ని మచిలీపట్నం తీసుకువెళ్ళే ఆలోచన జనసేన నాయకులు, సైనికులు చేస్తున్నారు.

 

ఈ ర్యాలీని ఏకంగా 10,000 బైకులతో జనసైనికులు నిర్వహించడానికి తెలుస్తుంది. తాజాగా జనసేన నాయకులు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఏపీలో రోడ్ షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసైనికులు సేనానిని ర్యాలీగా తీసుకొని వెళ్ళాలనే ఆలోచన సాధ్యమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేన ఆవిర్భావ సభ మాత్రం ఈసారి ఆ పార్టీ బల నిరూపణకి వేదికగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

 

Varalakshmi

Recent Posts

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలా..ఈ చిన్న పని చేస్తే చాలు?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…

18 hours ago

Mangoes: రాత్రిపూట మామిడిపండు తిని పడుకుంటున్నారా? ఈ ఇబ్బందులు మీ వెంటే?

Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…

2 days ago

Tirumala Tirupati: ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. శ్రీవారి దర్శన గడువు పెంపు..

Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…

2 days ago

TDP PARTY: టీడీపీలో రాజ్యసభ మంటలు.. మొద‌లైన బుజ్జ‌గింపులు..!

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…

2 days ago

Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…

2 days ago

AP POLITICS: ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. లీకైన హాట్ లిస్ట్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…

2 days ago

This website uses cookies.