AP Capital: ఏపీలో రాజధానులపై గత మూడేళ్ళుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అజెండాతో అధికార పార్టీ వైసీపీ ముందుకి వెళ్తుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు సైతం రాజధాని తరలింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనని అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే దేశీయ కంపెనీలకి సంబందించిన అధిపతులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని అని ఈ సమ్మిట్ లో జగన్ తెలియజేశారు. తాను కూడా త్వరలో విశాఖపట్నం రాబోతున్నా అని తెలిపారు. ఇక్క అద్భుతమైన వనరులు ఉన్నాయని, ప్రకృతి అందాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా విశాఖ అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇక మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాలు ఏపీ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని జగన్ తెలిపారు. ఇక తాను కూడా త్వరలో విశాఖపట్నంలో నివాసం ఏర్పరుచుకుంటా అని తెలిపారు. ఇక 304 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో కి రాబోతున్నాయని తెలిపారు. అలాగే 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు.
YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి.…
AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత,…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న…
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
This website uses cookies.