AP Capital: ఏపీలో రాజధానులపై గత మూడేళ్ళుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అజెండాతో అధికార పార్టీ వైసీపీ ముందుకి వెళ్తుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు సైతం రాజధాని తరలింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనని అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే దేశీయ కంపెనీలకి సంబందించిన అధిపతులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని అని ఈ సమ్మిట్ లో జగన్ తెలియజేశారు. తాను కూడా త్వరలో విశాఖపట్నం రాబోతున్నా అని తెలిపారు. ఇక్క అద్భుతమైన వనరులు ఉన్నాయని, ప్రకృతి అందాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా విశాఖ అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇక మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాలు ఏపీ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని జగన్ తెలిపారు. ఇక తాను కూడా త్వరలో విశాఖపట్నంలో నివాసం ఏర్పరుచుకుంటా అని తెలిపారు. ఇక 304 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో కి రాబోతున్నాయని తెలిపారు. అలాగే 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.