AP Capital: ఏపీలో రాజధానులపై గత మూడేళ్ళుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అజెండాతో అధికార పార్టీ వైసీపీ ముందుకి వెళ్తుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు సైతం రాజధాని తరలింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనని అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే దేశీయ కంపెనీలకి సంబందించిన అధిపతులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని అని ఈ సమ్మిట్ లో జగన్ తెలియజేశారు. తాను కూడా త్వరలో విశాఖపట్నం రాబోతున్నా అని తెలిపారు. ఇక్క అద్భుతమైన వనరులు ఉన్నాయని, ప్రకృతి అందాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా విశాఖ అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇక మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాలు ఏపీ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని జగన్ తెలిపారు. ఇక తాను కూడా త్వరలో విశాఖపట్నంలో నివాసం ఏర్పరుచుకుంటా అని తెలిపారు. ఇక 304 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో కి రాబోతున్నాయని తెలిపారు. అలాగే 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.