AP Capital: ఏపీలో రాజధానులపై గత మూడేళ్ళుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అజెండాతో అధికార పార్టీ వైసీపీ ముందుకి వెళ్తుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు సైతం రాజధాని తరలింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనని అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే దేశీయ కంపెనీలకి సంబందించిన అధిపతులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని అని ఈ సమ్మిట్ లో జగన్ తెలియజేశారు. తాను కూడా త్వరలో విశాఖపట్నం రాబోతున్నా అని తెలిపారు. ఇక్క అద్భుతమైన వనరులు ఉన్నాయని, ప్రకృతి అందాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా విశాఖ అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇక మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాలు ఏపీ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని జగన్ తెలిపారు. ఇక తాను కూడా త్వరలో విశాఖపట్నంలో నివాసం ఏర్పరుచుకుంటా అని తెలిపారు. ఇక 304 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో కి రాబోతున్నాయని తెలిపారు. అలాగే 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.