AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసిపి మూడు రాజధానుల జెండాతో ముందుకు వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ త్వరలో విశాఖ తాను కూడా షిఫ్ట్ అవుతున్నానని అక్కడి నుంచి పరిపాలన ఉంటుందని చెప్పారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ సదస్సులో కూడా విశాఖపట్నం రాజధాని కాబోతుందని తెలియజేశారు. అయితే మూడు రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఖచ్చితమైన నిర్ణయాన్ని జగన్ ప్రకటించలేకపోతున్నారని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తూ వచ్చింది.
అయితే ఈ విషయంలో జగన్ చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో జూలై నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. జూలైలో విశాఖ వెళ్లడం ఖాయమని తెలియజేశారు. అలాగే ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. గెలవని పక్షంలో మంత్రుల పదవులు ఊడిపోవడం గ్యారంటీ అని కూడా క్లారిటీ ఇచ్చేసారు. అలాగే సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను కూడా తిప్పి కొట్టాలని తెలిపారు. దీనిబట్టి మూడు రోజుల అజెండాలో జగన్ సుఖసంతో కూడా ప్రస్తుతం విశాఖ రాజధాని చుట్టూనే ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి అదే పనిగా ఇలా విశాఖని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటనలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. సుప్రీంకోర్టులపైన కూడా జగన్ కి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.