Politics: గెలుపు గుర్రాలని గుర్తించే పనిలో జగన్… వారికే టికెట్లు

Politics: ఏపీలో అధికార పార్టీ వైసీపీ జోరుగా తన గెలుపు గుర్రాలని సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో గెలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 ఎన్నికలలో వచ్చిన 154 సీట్లని ఇప్పుడు 175కి చేసుకోవాలని పలుమార్లు నియోజకవర్గ ఇన్ చార్జ్ ల సమావేశంలో నొక్కి మరీ చెప్పారు. ప్రతిసారి కుప్పం నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించే వారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ ప్రజల మధ్యకి గడపగడపకి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్లి సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కచ్చితంగా ఈ సారి మాత్రం అలా ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం పెంచుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉందని వారందరూ తమ పంథా మార్చుకుంటే మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తుందని, లేదంటే ఎలాంటి మొహమాటం లేకుండా తప్పిస్తానని చెప్పేశారు. ఇక జగన్ ఆ విషయం చెప్పిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళకుండా ఉన్న ఎమ్మెల్యేలు అందరిని పక్కన పెట్టడానికి ఇప్పటిజే వైసీపీ ఆయా నియోజకవర్గాల లో కొత్త ఇన్ చార్జ్ లని నియమించింది. ఇక కొత్త ఇన్ చార్జ్ లతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రావనే విషయం అర్ధమైపోయింది. దీంతో వారిలో చాలా మంది సైలెంట్ అయిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా జగన్ నియోజకవర్గాల వారీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లతో మరోసారి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపుగా ఆయా నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎవరనేది ఖరారు చేసే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్న కొంత మందిని సమీకరణాలలో భాగంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తున్న నేపధ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ పై కాపు అభ్యర్ధిగా, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతని నిలబెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

గతంలో ఆమె పీఆర్పీ తరుపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో వైపు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ దాదాపుగా చంద్రబాబు మీద పోటీ చేయడం ఖాయం అయిపొయింది. ఇక విశాఖలో కూడా ఎంపీగా ఈ సారి బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీకి మళ్ళీ సీటు ఇచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. అలాగే నెల్లూరులో కూడా కొంత మంది స్థానాలని మార్పు చేసే యోచనలో జగన్ ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు రాత్రికి వైసీపీలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే విషయంపై ఒక పార్టీలో క్యాడర్ కి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అలాగే అందరికి ముందస్తు ఎన్నికల గురించి కూడా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.