Politics: ఏపీలో అధికార పార్టీ వైసీపీ జోరుగా తన గెలుపు గుర్రాలని సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో గెలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 ఎన్నికలలో వచ్చిన 154 సీట్లని ఇప్పుడు 175కి చేసుకోవాలని పలుమార్లు నియోజకవర్గ ఇన్ చార్జ్ ల సమావేశంలో నొక్కి మరీ చెప్పారు. ప్రతిసారి కుప్పం నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించే వారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ ప్రజల మధ్యకి గడపగడపకి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్లి సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కచ్చితంగా ఈ సారి మాత్రం అలా ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం పెంచుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉందని వారందరూ తమ పంథా మార్చుకుంటే మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తుందని, లేదంటే ఎలాంటి మొహమాటం లేకుండా తప్పిస్తానని చెప్పేశారు. ఇక జగన్ ఆ విషయం చెప్పిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళకుండా ఉన్న ఎమ్మెల్యేలు అందరిని పక్కన పెట్టడానికి ఇప్పటిజే వైసీపీ ఆయా నియోజకవర్గాల లో కొత్త ఇన్ చార్జ్ లని నియమించింది. ఇక కొత్త ఇన్ చార్జ్ లతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రావనే విషయం అర్ధమైపోయింది. దీంతో వారిలో చాలా మంది సైలెంట్ అయిపోయారు.
గతంలో ఆమె పీఆర్పీ తరుపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో వైపు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ దాదాపుగా చంద్రబాబు మీద పోటీ చేయడం ఖాయం అయిపొయింది. ఇక విశాఖలో కూడా ఎంపీగా ఈ సారి బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీకి మళ్ళీ సీటు ఇచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. అలాగే నెల్లూరులో కూడా కొంత మంది స్థానాలని మార్పు చేసే యోచనలో జగన్ ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు రాత్రికి వైసీపీలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే విషయంపై ఒక పార్టీలో క్యాడర్ కి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అలాగే అందరికి ముందస్తు ఎన్నికల గురించి కూడా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.