Categories: Tips

Health: ఎక్కువకాలం బ్రతకాలని అనుకుంటున్నారా? అయితే ఇవి పాటించండి

Health: ప్రస్తుతం దైనందిన జీవితంలో మన రోజువారి ఆహారపు అలవాట్లు, జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సంపాదన ద్యాసలో పరుగులు పెడుతూ దైనందిన జీవితంలో చాలా అలవాట్లని క్రమమైన పద్ధతిలో నిర్వహించకుండా ఎక్కువ మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాగే ఆహారపు అలవాట్లు కూడా మన జీవన ప్రమాణాలని ప్రభావితం చేస్తాయి. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాగే శరీరంలో అసంకల్పిత పెరుగుదల కనిపిస్తుంది. తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఉబకాయం వస్తుంది. అలాగే సరైన నిద్రపోకుండా రాత్రి సమయాలలో కూడా పనులు చేసే వారు ఉన్నారు.

 

అలాగే ఎక్కువగా టెన్షన్ తో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే డిప్రెషన్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇవన్ని కూడా వేగంగా శరీరాన్ని వృద్ధాప్యంలోకి తీసుకొని పోవడంతో అనారోగ్య సమస్యలు తీసుకొచ్చి శారీరకంగా బలహీనంగా మారడానికి కారణం అవుతాయి. దీంతో దీర్ఘకాలిక ఆయుస్సు క్రమంగా తగ్గిపోతుంది. దీంతో వందేళ్ళు బ్రతకాల్సిన వారు తక్కువ వయస్సులోనే మృతి చెందుతున్నారు. అయితే దీర్ఘకాలిక ఆయుష్షుని కలిగి ఉండాలంటే మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని హార్వర్డ్ యూనివర్సిటీ  శాస్త్రవేత్తలు చేస్తున్నారు.

if-you-can-follow-this-life-span-will-increase

వారు చేసిన అధ్యయనంలో ఎక్కువ కాలం బతకడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేశారు.  శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నవారు వెంటనే దీనిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. విటమిన్ డి లోపం వలన కండరాల బలహీనత, ఎముకలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి సమృద్ధిగా లభించి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఇక పాజిటివ్ ఆలోచనలని పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు.

 

ఎలాంటి సమయంలో అయిన పాజిటివ్ గా ఆలోచించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఈ ఆలోచనలు మనల్ని అనవసరమైన డిప్రెషన్ కి గురికాకుండా ఆపుతాయి. అలాగే మానసికంగా బలంగా ఉండగలం. అలాగే సోషల్ మీడియాలో వెచ్చించే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ స్క్రీన్ సమయంతో నిద్ర సమయం తగ్గిపోతుంది. నిద్ర సమయం తగ్గితే శరీరంలో ఒత్తిడి పెరిగి వృద్ధాప్య చాయలు ముఖంలోకి వస్తాయి. పుట్టగొడుగులలో ఉండే విటమిన్ డి, సెలీనియం, ఎర్గోథియోనిన్ గ్లూటాతియోన్ వంటివి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

 

అలాగే ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల `సమయం కచ్చితంగా నిద్ర పోవాలి. నిద్రలేమి కారణంగానే శరీర జీవక్రియలలో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్య సమస్యలు అన్ని వస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా 7 గంటలకి పైగా నిద్ర ఉండాలని చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

7 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

13 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

20 hours ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

2 days ago

Political News: ఏపీలో పవన్.. తెలంగాణలో రేవంత్: ఇద్దరి ప్లాన్ ఒక్కటేనా?

Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…

2 days ago

This website uses cookies.