Narendra Modi: తగ్గితే ఖజానాకు.. పెరిగితే జనం నెత్తిన.. ఇదెక్కడి న్యాయం మోదీ సాబ్‌?

Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టండి. మరి అదే ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయా? అయితే ఆ లాభాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఎక్సైజ్ సుంకం, సెస్ ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు మళ్లించండి! ఇదీ గత కొంతకాలంగా దేశంలో నడుస్తున్న ఇంధన ధరల రివర్స్ న్యాయం. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నెపం చూపిస్తూ, సామాన్య పౌరుడికి నొప్పి తెలియకుండా భారం మోపడంలో చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

ఒకేసారి ఐదు రూపాయలో, ఆరు రూపాయలో పెంచితే జనం రోడ్లపైకి వస్తారు, రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చారు. నాలుగు రోజుల క్రితం మూడు రూపాయలు పెంచిన చమురు సంస్థలు, ఆ వేడి చల్లారకముందే తాజాగా మరో 90 పైసలు వడ్డించాయి. వారం తిరిగేసరికి రూపాయి, రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయే ఈ మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. రోజువారీగా లేదా వారానికోసారి పైసల రూపంలో పెంచడం వల్ల వినియోగదారుడు పెద్దగా రియాక్ట్ అవ్వడు. కానీ, నెల తిరిగేసరికి అది నాలుగు నుండి ఐదు రూపాయల భారంగా మారి, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

if-it-decreases-it-goes-to-the-treasury-if-it-increases-it-goes-to-the-people-where-is-the-justice-in-this-modi-saab

Narendra Modi: కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో తన ఖజానాను నింపుకోవడానికే ప్రాధాన్యత.!

అంతర్జాతీయ ట్రెండ్స్ ప్రకారం ధరలు పెరగడం సహజమే అని సరిపెట్టుకుందాం. కానీ, అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు పాతాళానికి పడిపోయినప్పుడు ఆ ప్రయోజనం సామాన్యుడికి ఎందుకు దక్కలేదు? అప్పుడు మార్కెట్ సూత్రాలు ఏమయ్యాయి? ముడిచమురు చౌకగా దొరికిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో తన ఖజానాను నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ, లీటర్ ధరను యాభై రూపాయలకు తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఇంధన ధరలు ఎప్పుడూ ఒక గరిష్ట స్థాయిలోనే స్థిరపడిపోయాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభం రాగానే, ఆ భారాన్ని యథావిధిగా జనం నెత్తినే రుద్దుతున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం బంకుల దగ్గరితోనే ఆగదు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పుల వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చివరకు మిగిలేది ఒక్కటే ప్రశ్న.. అంతర్జాతీయంగా నష్టాలు వస్తే భరించాల్సింది ప్రజలేనా? లాభాలు వస్తే దాచుకోవాల్సింది ప్రభుత్వ ఖజానాయేనా? సబ్ కా సాత్ అంటే సామాన్యుడిని ముంచడమేనా మోదీ సాబ్?

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

AP Politics: మ‌ళ్లీ అదే త‌ప్పు.. వైసీపీ ఇక మార‌దా..?

AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం.…

7 hours ago

Bandi Bhagirath Case: బండి భగీరథ్‌కు జీవిత ఖైదు.. కేసులో బిగ్‌ ట్విస్ట్!

Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ చుట్టూ ఉచ్చు…

8 hours ago

Andhra Pradesh: జనసేనలో బిగ్ చేంజ్.. పవన్ ` 7 మెంబర్స్` ప్లాన్!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో…

2 days ago

Telangana Politics: ఢిల్లీ పాలిటిక్స్‌లోకి రేవంత్.. టార్గెట్ ఫిక్స్‌..!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా…

2 days ago

Andhra Pradesh: రేవంత్ రెడ్డి సెంటిమెంట్.. ఏపీకి వ‌ర్తిస్తుందా..?

Andhra Pradesh: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల ఒక…

2 days ago

AP Politics: వైసీపీ ఉచిత స‌ల‌హాలు.. ప‌వ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!

AP Politics: రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అయితే ప్రత్యర్థులు ఆడే మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టడంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…

2 days ago

This website uses cookies.