Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు ఉదయాన్నే ఫైళ్లతో ఆఫీసులకు పరుగులు తీసే సంప్రదాయానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.
సాధారణంగా ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఇంటి నుంచే పని విధానాన్ని, ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు స్పందించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా, అనవసర ప్రయాణాలకు బ్రేక్ వేయాలని సర్కార్ నిర్ణయించింది.
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు, భవిష్యత్తులో ప్రపంచమంతా డిజిటల్ మయం కాబోతోందని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భౌతికంగా ఆఫీసులకు హాజరు కావాల్సిన అవసరం లేని విభాగాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీ కాన్ఫరెన్స్ల ద్వారానే సమీక్షలు నిర్వహించాలని, ఫైళ్ల కదలికను ఆన్లైన్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రవాణా, విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా.. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అంచనా.
ప్రస్తుతానికి అన్ని శాఖల్లోనూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టే అవకాశం ఉంది. మరికొన్ని శాఖల్లో హైబ్రిడ్ మోడల్ (వారంలో కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇల్లు) అమలు చేసేలా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు మినహా, మిగిలిన సెక్షన్ల ఉద్యోగులకు ఈ ఊరట లభించనుంది. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీవనశైలిలో ఇది ఒక పెను మార్పుగా నిలవనుంది.
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
This website uses cookies.