TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన స్టైల్ ఏమాత్రం మారలేదు. తాను నిద్రపోరు.. అవతలి వారిని నిద్రపోనివ్వరు అనే పేరు ఆయనకు ఉంది. అయితే ఈ పని రాక్షసుడు బయటి వారికే కాదు, తన సొంత కుమారుడు, మంత్రి నారా లోకేష్కు కూడా చమటలు పట్టిస్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా ఏదైనా పెద్ద విజయం సాధించినప్పుడు ఎవరైనా సరే కాస్త రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు డిక్షనరీలో ఆ మాటే లేదంటున్నారు లోకేష్. తాజాగా సిఐఐ నిర్వహించిన ఒక సదస్సులో లోకేష్ తన తండ్రి పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “మేము ఏదైనా విజయం సాధిస్తే.. కనీసం ఐదు నిమిషాలు కూడా ఆ సంతోషాన్ని అనుభవించే ఛాన్స్ ఆయన ఇవ్వరు. ఒక లక్ష్యం పూర్తి కాగానే, వెంటనే మరో పెద్ద టార్గెట్ను మన ముందు పెడతారు” అంటూ లోకేష్ నవ్వుతూనే తన కష్టాన్ని చెప్పుకొచ్చారు.
లోకేష్ తన బిజీ షెడ్యూల్ గురించి వివరిస్తూ ఒక ఆసక్తికర ఉదాహరణ చెప్పారు. ప్రధాని మోదీ పర్యటన ముగించుకుని, వెంటనే సింగపూర్ వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా అస్సాం వెళ్లాల్సిన టైంలో కూడా బాబు నుంచి ఆదేశాలు ఆగలేదట. కేవలం 4 గంటల ప్రయాణ వ్యవధిలో ఏకంగా 22 కీలక అంశాలపై లోకేష్కు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు. ఆ పనులన్నీ ఫాలో-అప్ చేయాలని ఆర్డర్ వేయడంతో లోకేష్ షాక్ అయ్యారట.
ఈ ఉదంతం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. పార్టీకి కాబోయే సారధి అయినా, తన కుమారుడైనా.. పని విషయంలో మాత్రం చంద్రబాబు ఎవరికీ రాయితీలు ఇవ్వరు. “ఆయనతో పని చేయడం చాలా కష్టం” అని లోకేష్ ఓపెన్గా చెప్పేశారంటే, బాబు పెడుతున్న టార్గెట్స్ ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా, తన కొడుకును కూడా ఒక సాధారణ కార్యకర్తలా, మంత్రిలా ఉరికిస్తున్న బాబు స్టైల్ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
This website uses cookies.