Gold: సాధారణంగా మహిళలకు ఆభరణాలే అలంకరణ, అందం అనే సంగతి మనకు తెలిసిందే అందుకే మహిళలు ఎన్నో విభిన్న రకాల నగలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని నగలు ధరించిన మహిళలు మాత్రం కాళ్లకు బంగారు పట్టీలు వేసుకోరు. ఇలా బంగారు పట్టిలు వేసుకోకపోవడానికి గల కారణం వెనుక పురాణ గాధే ఉందని తెలుస్తోంది. మహిళలు వంటి నిండా బంగారం ధరించిన కాళ్లకు మాత్రం వెండి పట్టిలు మాత్రమే పెట్టుకుంటారు.
ఇలా వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోయి ఆరోగ్యపరంగా మనకు మంచి కలుగుతుందని భావిస్తారు అందుకే వెండి పట్టీలు మాత్రమే వాళ్లకు ధరిస్తారు. ఇక బంగారం ఎంత ఉన్నా, కాళ్లకు మెట్టెలు గాను, పట్టీలుగా మాత్రం ధరించరు అలా ధరించడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు.
బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారు ఆభరణాలు మన వంటిపై వేసుకున్న పర్వాలేదు కానీ కాళ్లకు వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్టని పండితులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగాను అలాగే పట్టీలు గాను బంగారు ఆభరణాలను ధరించకూడదని అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి సంపద మొత్తం పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే కాళ్లకు బంగారు పట్టీలు మాత్రం ధరించరు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.