Gold: సాధారణంగా మహిళలకు ఆభరణాలే అలంకరణ, అందం అనే సంగతి మనకు తెలిసిందే అందుకే మహిళలు ఎన్నో విభిన్న రకాల నగలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని నగలు ధరించిన మహిళలు మాత్రం కాళ్లకు బంగారు పట్టీలు వేసుకోరు. ఇలా బంగారు పట్టిలు వేసుకోకపోవడానికి గల కారణం వెనుక పురాణ గాధే ఉందని తెలుస్తోంది. మహిళలు వంటి నిండా బంగారం ధరించిన కాళ్లకు మాత్రం వెండి పట్టిలు మాత్రమే పెట్టుకుంటారు.
ఇలా వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోయి ఆరోగ్యపరంగా మనకు మంచి కలుగుతుందని భావిస్తారు అందుకే వెండి పట్టీలు మాత్రమే వాళ్లకు ధరిస్తారు. ఇక బంగారం ఎంత ఉన్నా, కాళ్లకు మెట్టెలు గాను, పట్టీలుగా మాత్రం ధరించరు అలా ధరించడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు.
బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారు ఆభరణాలు మన వంటిపై వేసుకున్న పర్వాలేదు కానీ కాళ్లకు వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్టని పండితులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగాను అలాగే పట్టీలు గాను బంగారు ఆభరణాలను ధరించకూడదని అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి సంపద మొత్తం పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే కాళ్లకు బంగారు పట్టీలు మాత్రం ధరించరు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.