Gold: సాధారణంగా మహిళలకు ఆభరణాలే అలంకరణ, అందం అనే సంగతి మనకు తెలిసిందే అందుకే మహిళలు ఎన్నో విభిన్న రకాల నగలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని నగలు ధరించిన మహిళలు మాత్రం కాళ్లకు బంగారు పట్టీలు వేసుకోరు. ఇలా బంగారు పట్టిలు వేసుకోకపోవడానికి గల కారణం వెనుక పురాణ గాధే ఉందని తెలుస్తోంది. మహిళలు వంటి నిండా బంగారం ధరించిన కాళ్లకు మాత్రం వెండి పట్టిలు మాత్రమే పెట్టుకుంటారు.
ఇలా వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోయి ఆరోగ్యపరంగా మనకు మంచి కలుగుతుందని భావిస్తారు అందుకే వెండి పట్టీలు మాత్రమే వాళ్లకు ధరిస్తారు. ఇక బంగారం ఎంత ఉన్నా, కాళ్లకు మెట్టెలు గాను, పట్టీలుగా మాత్రం ధరించరు అలా ధరించడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు.
బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారు ఆభరణాలు మన వంటిపై వేసుకున్న పర్వాలేదు కానీ కాళ్లకు వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్టని పండితులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగాను అలాగే పట్టీలు గాను బంగారు ఆభరణాలను ధరించకూడదని అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి సంపద మొత్తం పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే కాళ్లకు బంగారు పట్టీలు మాత్రం ధరించరు.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.