Gold: సాధారణంగా మహిళలకు ఆభరణాలే అలంకరణ, అందం అనే సంగతి మనకు తెలిసిందే అందుకే మహిళలు ఎన్నో విభిన్న రకాల నగలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని నగలు ధరించిన మహిళలు మాత్రం కాళ్లకు బంగారు పట్టీలు వేసుకోరు. ఇలా బంగారు పట్టిలు వేసుకోకపోవడానికి గల కారణం వెనుక పురాణ గాధే ఉందని తెలుస్తోంది. మహిళలు వంటి నిండా బంగారం ధరించిన కాళ్లకు మాత్రం వెండి పట్టిలు మాత్రమే పెట్టుకుంటారు.
ఇలా వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోయి ఆరోగ్యపరంగా మనకు మంచి కలుగుతుందని భావిస్తారు అందుకే వెండి పట్టీలు మాత్రమే వాళ్లకు ధరిస్తారు. ఇక బంగారం ఎంత ఉన్నా, కాళ్లకు మెట్టెలు గాను, పట్టీలుగా మాత్రం ధరించరు అలా ధరించడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు.
బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారు ఆభరణాలు మన వంటిపై వేసుకున్న పర్వాలేదు కానీ కాళ్లకు వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్టని పండితులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగాను అలాగే పట్టీలు గాను బంగారు ఆభరణాలను ధరించకూడదని అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి సంపద మొత్తం పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే కాళ్లకు బంగారు పట్టీలు మాత్రం ధరించరు.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.