Gannavaram Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ రోజు రోజుకి ప్రతిపక్షాలని లక్ష్యంగా చేసుకొని వారిని ఎన్ని విధాలుగా ఛాన్స్ దొరికితే అన్ని విధాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. తాజాగా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి కారుని దగ్ధం చేశారు. ఈ దాడి ఘటనలో పోలీసులు తిరిగి టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెట్టారనేది టీడీపీ నేతల వాదన. వైసీపీ పార్టీనాయకులకి కొమ్ము కాస్తూ అంతమంది వచ్చి విద్వంసం చేసిన అసలు కేసులే నమోదు చేయలేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేతలు వల్లభనేని వంశీని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి చేస్తున్నారు.
అలాగే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సైకో సీఎం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఉగ్రవాదులుగా తయారయ్యారు అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటి విద్వంసం రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంటే అసలు రాష్ట్రంలో వైసీపీ తిరగగలిగేది కాదని అన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ వంశీకి దమ్ముంటే విజయవాడ సెంటర్ కి రావాలని తన రాజకీయ చరిత్ర ఏంటో బయటపెడతా అని అన్నారు.
ఎంత మందిని చంపించాడో, ఎన్ని ఘోరాలు చేసాడో రుజువు చేస్తానని అన్నారు. ఇక బుడ్డా వెంకన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. తనకి విజయవాడ రావాల్సిన అవసరం లేదని దమ్ముంటే గన్నవరం వచ్చి ఇక్కడ తేల్చుకోవాలని ప్రతి సవాల్ చేశారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు కూడా గన్నవరం ఘటనపై రియాక్ట్ అయ్యారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.