Categories: LatestNewsPolitics

Gannavaram Politics: తగ్గేదిలే అంటున్న టీడీపీ… తగ్గాల్సిందే అంటున్న వైసీపీ

Gannavaram Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ రోజు రోజుకి ప్రతిపక్షాలని లక్ష్యంగా చేసుకొని వారిని ఎన్ని విధాలుగా ఛాన్స్ దొరికితే అన్ని విధాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. తాజాగా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి కారుని దగ్ధం చేశారు. ఈ దాడి ఘటనలో పోలీసులు తిరిగి టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెట్టారనేది టీడీపీ నేతల వాదన. వైసీపీ పార్టీనాయకులకి కొమ్ము కాస్తూ అంతమంది వచ్చి విద్వంసం చేసిన అసలు కేసులే నమోదు చేయలేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేతలు వల్లభనేని వంశీని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి చేస్తున్నారు.

అలాగే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సైకో సీఎం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఉగ్రవాదులుగా తయారయ్యారు అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటి విద్వంసం రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంటే అసలు రాష్ట్రంలో వైసీపీ తిరగగలిగేది కాదని అన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ వంశీకి దమ్ముంటే విజయవాడ సెంటర్ కి రావాలని తన రాజకీయ చరిత్ర ఏంటో బయటపెడతా అని అన్నారు.

ఎంత మందిని చంపించాడో, ఎన్ని ఘోరాలు చేసాడో రుజువు చేస్తానని అన్నారు. ఇక బుడ్డా వెంకన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. తనకి విజయవాడ రావాల్సిన అవసరం లేదని దమ్ముంటే గన్నవరం వచ్చి ఇక్కడ తేల్చుకోవాలని ప్రతి సవాల్ చేశారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు కూడా గన్నవరం ఘటనపై రియాక్ట్ అయ్యారు.

Varalakshmi

Recent Posts

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

21 hours ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

22 hours ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

23 hours ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

23 hours ago

AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…

24 hours ago

Jyeshtha Pournami: నేడే జేష్ఠ్య పౌర్ణమి.. ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్టే?

Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…

1 day ago

This website uses cookies.