Health Benefits: ప్రస్తుత కాలంలో ప్రజల జీవన విధానంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి సరైన సమయానికి తినడం నిద్రపోవడం వంటివి మానేస్తూ ఆలస్యంగా తినడం ఆలస్యంగా నిద్రపోవడం వంటివి అలవాటు చేసుకున్నారు అయితే ముఖ్యంగా తిండి విషయంలో కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి పోషకాహార పదార్థాలు కలిగినటువంటి తిండిని పూర్తిగా పక్కన పెట్టి ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో చాలామంది రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఆ సమయంలో స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది పిజ్జా బర్గర్లు సమోసాలు చిప్స్ వంటివి రాత్రిపూట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇలా రాత్రి పడుకోవడానికి ముందు ఈ విధమైనటువంటి స్నాక్స్ కనక తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. లేట్ నైట్ స్నాక్స్ అలవాటు వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. పడుకునే ముందు చిరుతిళ్ళు తినడం కారణంగా సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రను నియంత్రించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాదు.
ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల మనపై అధిక ఒత్తిడి కలిగి ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది అంతేకాకుండా రాత్రి సమయంలో జీర్ణ క్రియ రేటు తక్కువగా ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. పడుకునే ముందు స్నాక్స్ తింటే శరీర బరువు అదుపు తప్పుతుంది. కేలరీలు కొవ్వుగా మారతాయి. దాంతో మీరు భారీగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పడుకోవడానికి ముందు ఎలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.