Tollywood: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సినిమా సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం తగ్గింది. గతంలో తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూసే అలవాటు ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఒక్కోసారి వీళ్ళ కోరికలు డిమాండ్లుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో నిర్మాతలను, దర్శకులను ట్యాగ్ చేసి మరి వార్నింగ్ లు ఇవ్వడం, అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలంటూ నిర్మాతలను, దర్శకులను టెన్షన్ పెట్టొద్దు అని చెప్పారు. అయితే అభిమానులు మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదని చెప్పాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే నిర్మాతలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఫైనల్ గా అప్డేట్ వచ్చిన తర్వాత కూడా టైటిల్ అనౌన్స్ చేయాలంటూ కొత్త డిమాండ్ చేస్తున్నారు. అలాగే మేము అడిగినప్పుడల్లా అప్డేట్స్ ఇవ్వాలనే విధంగా వారు కామెంట్స్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్ ఆది పురుష్ సినిమా రిలీజ్ విషయంలో కూడా దర్శకుడు ఓం రౌత్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్మాతలకు ఒకింత అసహనాన్ని గురి చేస్తున్నాయనే మాట వినిపిస్తుంది. అలాగే దర్శకులను కూడా కాస్త ఆందోళన గురి చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో స్టార్ హీరోల అభిమానులు కచ్చితంగా తమ పద్ధతి మార్చుకోవాల్సిందే అంటూ సూచిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం తగ్గేది లే అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ లేపుతున్నారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
This website uses cookies.