YS Jagan: ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికలలో కూడా వివేకంగా 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురవుతూ ఉండడం గమనార్హం. వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలతో చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ చేశారు అనే ఆరోపణలతో సస్పెండ్ చేసిన సంగతి విధితమే. అయితే బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం పైన ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
ఆయనకి అనుకూలంగా ఉండే వారికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఏకంగా 60 మందికి పైగా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించే పనిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే వీరిలో టిక్కెట్టు రాదు అని నిర్ణయించుకున్న వాళ్ళు బయటకి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వీరందరూ బయటకు రావడంతోనే వైసీపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఓ రకమైన అసహనంతో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేల నుంచి రానున్న రోజుల్లో కచ్చితంగా జగన్ ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉన్న మాట.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
This website uses cookies.