Devotional Tips: శ్రావణమాసం రావడంతో మహిళలందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో పెద్ద ఎత్తున మహిళలు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి పవిత్రమైన మాసంలో అమ్మవారి అనుగ్రహం మనపై ఉండడానికి శ్రావణ శుక్రవారం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ వ్రతమాచరిస్తూ ఉంటారు. అమ్మవారిని పూజించే వారు పొరపాటున కూడా ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అదే విధంగా మద్యపానం సేవించకూడదు.ఇతరుల పట్ల మంచి ఆలోచనలతో ఉండాలి కానీ కుదురుద్దేశంతో ఉండకూడదు ఇక ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉంటే వారు ఎట్టి పరిస్థితులలోనూ దేవాలయాలకు వెళ్ళకూడదు. ఇక శ్రావణ శుక్రవారం మంగళవారం ఎవరికీ పొరపాటున కూడా అప్పు ఇవ్వకూడదు. అదేవిధంగా ఈ రెండు రోజులలో నల్లని వస్త్రాలను కూడా ధరించకూడదు.
ఇక శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే అమ్మవారికి పారిజాత పుష్పాలతో పూజ చేయడం ఎంతో మంచిది అది కూడా చెట్టుపై నుంచి కోసిన పుష్పాలు కాకుండా నేల రాలిన పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇక చాలామంది పువ్వులను కడిగి పూజ చేస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పొరపాటున కూడా ఉన్నత పుష్పంతో పూజ చేయకూడదు. ఇలాంటి నియమాలను పాటిస్తూ అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.