Health: ప్రస్తుతం రోజుల్లో మన శారీరక ఆరోగ్యమే మనకి కొండంత ఆస్తి అని చెప్పాలి. చాలా మంది చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు తరుచుగా చూస్తూ ఉన్నాం. అలాగే శారీరంలో అవాంచిత పెరుగుదల కూడా కనిపిస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం లేదు. సరిగా నిద్రపోవడం లేదు. ఎనిమిది గంటల నిద్ర సమయం చాలా మందిలో సగానికి తగ్గిపోయింది అని చెప్పాలి. అలాగే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పెరిగిపోతున్న కాలుష్యంతో చాలా వేగంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. నగరాలలో కూడా అక్కడక్కడ పార్కులని అభివృద్ధి చేస్తున్నారు. పచ్చదనాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రోజువారి వ్యాయామాల మీద దృష్టి పెడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అద్యయనం చేశారు. రోజుకి 11 నిమిషాలు వాకింగ్ చేస్తే గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ఈ కొత్త పరిశోధనని ప్రచురించారు. వారానికి 150 నిమిషాలపాటు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఒకవేళ కుదరకుంటే ఒక 75 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఇలా చేయడం వలన చాలా వరకు అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు సమస్యల బారి నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదస్థాయి కూడా తగ్గుతుందని అంటున్నారు. అసలు ఏమీ చేయకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కంటే ఉన్న పరిధిలోనే రోజుకి కనీసం 11 నిమిషాలు వ్యాయామం, ముఖ్యంగా వాకింగ్ చేయడం వలన చాలా ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వీరు అద్యయనంలో పేర్కొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.