Health: ప్రతి ఇంట్లో బెల్లం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడంటే తీపి కోసం పంచదార ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ పూర్వం అన్ని తీపి పదార్ధాలలో బెల్లం మాత్రమే ఉపయోగించేవారు. బెల్లంతో చేసే పిండి వంటలనే ఎక్కువగా తినేవారు. ఓ విధంగా తీపి పదార్ధాలు అంటే బెల్లం లేకుండా చేసేవారు కాదు. పంచదార అనేది చాలా తక్కువ. మారుతున్న కాలంతో పాటు ప్రజల అవసరాలలో పంచదారకి ప్రాముఖ్యత పెరిగింది. దానికి కారణం ధర తక్కువ ఉండటం, సులభంగా ఉపయోగించడానికి అనువుగా ఉండటంతో దీనిని వాడుతున్నారు.
అయితే పంచదార ఎక్కువగా తినే వారిలో షుగర్ చాలా వేగంగా వస్తుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. షుగర్ వచ్చిన తర్వాత పూర్తిగా తీపి పదార్ధాలకి దూరం కావాలి. అయితే బెల్లాన్ని ఉపయోగించే రోజులలో ప్రజల్లో షుగర్ వ్యాధి అంటేనే తెలియదు. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వారిలో షుగర్ వ్యాధి అనేది సాధారణం అయిపొయింది. ఇదిలా ఉంటే తీపి పదార్ధాలలో బెల్లం ఉపయోగించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. సహజసిద్ధంగా చెరుకు నుంచి తయారయ్యే ఈ బెల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే చిన్న బెల్లం ముక్క తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతలని బెల్లం చాలా అద్భుతంగా నియంత్రిస్తుందని అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున బెల్లం తింటే ఎసిడిటీ, కడుపుమంట దూరం అవుతుంది.అలాగే బెల్లంలో కాల్షియం పదార్ధాలు ఎక్కువగా ఉండటం వలన ఎముకల దృఢత్వం పెరుగుతుంది. అలాగే నరాల సమస్య, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. దాంతో పాటు ఐరన్, మినరల్స్ ఇందులో అధిక మోతాదులో ఉండటం వలన శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బెల్లంలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు, నాడీ వ్యవస్థని సరళతరం చేస్తుంది. మైగ్రేయిన్ సమస్యలు ఉన్నవారు బెల్లం, నెయ్యి కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా బెల్లంలో ఎన్నో రకాల సమస్యలని దూరం చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీనిని పిండివంటలలో ఉపయోగించేవారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.