Friday: సాధారణంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కావడంతో పెద్ద ఎత్తున శుక్రవారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మనపై అనుగ్రహం చూపిస్తారని అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని వెంటాడవని భావిస్తూ ఉంటారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.
శుక్రవారం అమ్మవారిని పూజించేవారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు పొరపాటున ఇలాంటి తప్పులు కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండదని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా దానధర్మాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. శుక్రవారం పొరపాటున కూడా తెలుపు రంగు వస్తువులను దానం చేయకూడదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ విధమైనటువంటి రంగు వస్తువులను దానం చేయకపోవడం మంచిది.
శుక్రవారం ఏ సమయంలోనో తెలుపు రంగు వస్తువులు అయినటువంటి బియ్యం పంచదార ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు. వీటితోపాటు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా ఇతరుల పట్ల పరుష పదాలు మాట్లాడకుండా ఉండాలి. శుక్రవారం ఎవరితోనో గొడవలు కూడా పడకూడదు. ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా చాలా సమయమనం పాటించాలి. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే శుక్రవారం ఈ విధంగా నడుచుకోవడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.