AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ – ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. కాకినాడలో నమోదైన కేసుతో మొదలైన ఈ రగడ.. రాజమండ్రి పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్తో ముగిసిపోయిందని అంతా భావించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం తెలంగాణ డీజీపీని కలిసి, తాను ఇప్పటికే వివరణ ఇచ్చేశానని, ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని సంకేతాలు ఇచ్చారు. కానీ, సీన్ కట్ చేస్తే కథ అసలైన మలుపు తిరిగింది. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ వేదికగా జరిగిన పరిణామాలు ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చాయి.
తెలంగాణ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో అత్యవసరంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ వివాదానికి సరికొత్త రంగు పులిమింది. ప్రొఫెసర్ నాగేశ్వర్కు సంఘీభావం ప్రకటించిన ఈ మేధావుల సదస్సు.. నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజాస్వామ్య దేశంలో విమర్శించే హక్కును, భావప్రకటన స్వేచ్ఛను పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం సరికాదని వారు హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలను తట్టుకోవాలని, అంతేకానీ బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కేవలం కేసుకు సంబంధించిన విషయాలే కాకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కూడా పదునైన విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు చెగువేరా ఆదర్శాలంటూ మాట్లాడిన పవన్.. నేడు చంద్రబాబు నాయుడి వ్యూహాల చుట్టూ తిరుగుతున్నారంటూ కొందరు సీనియర్ జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం ఈ చర్చలోకి లాగుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గతంలో ఎన్టీఆర్కు జరిగిన వెన్నుపోటు ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రా నాయకత్వం హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ తెలంగాణ విశ్లేషకులపై ఇటువంటి అణచివేత చర్యలకు పాల్పడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ సదస్సులో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన గళాన్ని మరింత పెంచారు. ప్రభుత్వం తనపై మోపిన కులాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను ముప్పై ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే జైళ్లకు, అరెస్టులకు భయపడలేదు.. ఇప్పుడు 62 ఏళ్ల వయసులో వెనక్కి తగ్గుతానా?” అంటూ పవన్ కళ్యాణ్ వైఖరిపై విరుచుకుపడ్డారు. తన ప్రాణం పోయినా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం ఆపనని, ధైర్యముంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒక ప్రభుత్వమే పౌరుల భావస్వేచ్ఛను అడ్డుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి పవన్ పీస్ ఫుల్ గా ఈ వివాదాన్ని ముగించాలని చూసినా.. ఈ తాజా పరిణామాలు ఈ పొలిటికల్ వార్ను మరికొన్నాళ్లు సజీవంగా ఉంచేలా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందో చూడాలి.
YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'పవర్ సెంటర్' అనగానే ఒకప్పుడు వైఎస్సార్ నీడ సూరీడు గుర్తుకొచ్చేవారు. సరిగ్గా అదే తరహాలో…
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి పొలిటికల్ స్క్రీన్ పైకి…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' సరికొత్త హంగులతో, సరిహద్దులు దాటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. ఏటా పసుపు…
This website uses cookies.