అధికారం చేతిలో ఉంటే సామాన్యులు కూడా ఎలా కుబేరులైపోతారో చెప్పడానికి కేఎన్ఆర్ ఎదుగుదలే ఒక ఉదాహరణగా మారుతోంది. గతంలో నెలకు కేవలం రూ. 12 వేల జీతంతో సాక్షి సంస్థలో పనిచేస్తూ, చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకున్న ఒక సాధారణ కుటుంబం.. ఐదేళ్లు తిరిగేసరికి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులుగా మారడం వెనుక ఉన్న మాయాజాలం ఏంటనే కోణంలో ఏసీబీ ఆరా తీస్తోంది. కేవలం కడప జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, వైజాగ్, అమరావతి లాంటి ప్రైమ్ లొకేషన్లలో లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, బినామీల పేరిట సాగిన వ్యాపారాల నెట్వర్క్ను అధికారులు స్కానింగ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు సచివాలయం నుండి తాడేపల్లి ప్యాలెస్ దాకా.. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు, లిక్కర్ డీల్స్, మైనింగ్ లీజుల వ్యవహారాల్లో కేఎన్ఆర్ చెప్పిందే వేదంగా సాగిందనే టాక్ కూడా ఉంది.
అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానాంశం జగన్ రెడ్డి వైఖరి. పీఏ స్థానంలో ఉన్న వ్యక్తి తన పేరు వాడుకుని ఇంత పెద్ద ఎత్తున వెనకేసుకుంటుంటే జగన్కు తెలీదా? లేక ఇదంతా అధినేత కనుసన్నల్లోనే సాగిన బినామీ హవానా? అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ కేఎన్ఆర్ స్వయంకృతాపరాధమే అయితే ఆయనకు వైకాపా నుండి ఎలాంటి మద్దతు దక్కే అవకాశం లేదు. ఒకవేళ ఇందులో పెద్దల హస్తం ఉంటే మాత్రం ఆయనను కాపాడటానికి తెరవెనుక ప్రయత్నాలు జరగక తప్పదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా 11 సీట్లకు పడిపోవడంతో రాజకీయ అండ పూర్తిగా బలహీనపడింది. ఈ తరుణంలో ఏసీబీ గనుక పూర్తి ఆధారాలతో చట్టపరమైన చర్యలకు దిగితే, కేఎన్ఆర్ జైలు పాలు కావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలను బద్దలు కొట్టే ఈ ఏసీబీ వేట ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని…
AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ - ప్రొఫెసర్…
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి పొలిటికల్ స్క్రీన్ పైకి…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' సరికొత్త హంగులతో, సరిహద్దులు దాటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. ఏటా పసుపు…
This website uses cookies.