AP POLITICS: వైసీపీకి అసలు ఆ హక్కు ఉందా.. అమరావతిలో రచ్చ.!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని పూర్తిగా పక్కనబెట్టిన జగన్ పార్టీ, ఇప్పుడు అక్కడ పర్యటించేందుకు సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని సెంటిమెంట్‌ను దెబ్బతీసిన వైసీపీకి, అసలు అమరావతి మట్టిపై అడుగుపెట్టే నైతిక హక్కు ఉందా అంటూ ప్రజాసంఘాలు, కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా అమరావతి పరిధిలో భూముల సేకరణ, రైతుల ఇబ్బందులంటూ వైసీపీ ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమే ఆలస్యం.. ఉండవల్లి సెంటర్ వద్ద సీన్ ఒక్కసారిగా మారిపోయింది. “గో బ్యాక్ వైసీపీ” అంటూ కూటమి సానుభూతిపరులు, స్థానిక రైతులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మాటల యుద్ధం కాస్తా తోపులాటగా మారడం, వైసీపీ వాహనాలపై రాళ్ల దాడి జరగడంతో తాడేపల్లి పరిసర ప్రాంతాలు క్షణాల్లో రణరంగంగా మారాయి.

 

ap-politics-does-the-ycp-even-have-that-right-uproar-over-amaravati

AP POLITICS: మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి గ్రామాలు ఎదుర్కొన్న నిర్బంధాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబుకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోననే సంకుచిత ఆలోచనతోనే వైసీపీ ఆనాడు రాజధాని పనులను నత్తనడకన నడిపించిందని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం సాగాలన్న కనీస సూత్రాన్ని విస్మరించి, ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారనే కోపం అమరావతి ప్రజల్లో ఇంకా చల్లారలేదు. ఇప్పుడు రెండో విడత భూముల పేరుతో కొంతమందిని వైసీపీ ఆఫీసుకు రప్పించుకుని, అమరావతి పరిరక్షణ కమిటీలంటూ డ్రామాలు ఆడటంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.

ఇక రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు ఏ ప్రతిపక్షానికైనా ఉంటుంది. కానీ, అసలు అమరావతిపై వైసీపీ అధికారిక స్టాండ్ ఏంటో చెప్పకుండా ఇలాంటి పర్యటనలు చేయడం వల్లే ఈ రచ్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటివరకు మూడు రాజధానులు అని, ఇవాళ మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ.. ముందుగా అమరావతి విషయంలో ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో, రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ వైసీపీ నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు, తీవ్ర ప్రతిఘటన తప్పవనేది తాజా ఘటనతో స్పష్టమవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Film Updates: నాగబంధం vs రావు బహదూర్.. ఈ వారం మహా పరీక్ష..!

Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…

42 minutes ago

Film Updates: హీరో టూ డైరెక్టర్.. రామ్ ముందున్న పెద్ద స‌వాల్ అదే..!

Film Updates: టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…

2 hours ago

Cinema News: ఫ్రాన్స్‌లో రాజమౌళి హిస్టరీ.. అక్కడ పర్మినెంట్ సీట్!

Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…

2 hours ago

TTD: టీటీడీకి అనంత్ అంబానీ ఊహించని గిఫ్ట్.. ఏకంగా రూ.27 కోట్లతో..?

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…

2 hours ago

Banana: వర్షా కాలంలో అరటిపండు తినకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు…

3 hours ago

Tirumala: తిరుమల వెళ్లే వాహనదారులు అలర్ట్.. కొండ పై ఈ పని చేస్తే అంతే సంగతులు..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…

6 hours ago

This website uses cookies.