AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని పూర్తిగా పక్కనబెట్టిన జగన్ పార్టీ, ఇప్పుడు అక్కడ పర్యటించేందుకు సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని సెంటిమెంట్ను దెబ్బతీసిన వైసీపీకి, అసలు అమరావతి మట్టిపై అడుగుపెట్టే నైతిక హక్కు ఉందా అంటూ ప్రజాసంఘాలు, కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా అమరావతి పరిధిలో భూముల సేకరణ, రైతుల ఇబ్బందులంటూ వైసీపీ ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమే ఆలస్యం.. ఉండవల్లి సెంటర్ వద్ద సీన్ ఒక్కసారిగా మారిపోయింది. “గో బ్యాక్ వైసీపీ” అంటూ కూటమి సానుభూతిపరులు, స్థానిక రైతులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతల కాన్వాయ్ను అడ్డుకున్నారు. మాటల యుద్ధం కాస్తా తోపులాటగా మారడం, వైసీపీ వాహనాలపై రాళ్ల దాడి జరగడంతో తాడేపల్లి పరిసర ప్రాంతాలు క్షణాల్లో రణరంగంగా మారాయి.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి గ్రామాలు ఎదుర్కొన్న నిర్బంధాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబుకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోననే సంకుచిత ఆలోచనతోనే వైసీపీ ఆనాడు రాజధాని పనులను నత్తనడకన నడిపించిందని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం సాగాలన్న కనీస సూత్రాన్ని విస్మరించి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్నారనే కోపం అమరావతి ప్రజల్లో ఇంకా చల్లారలేదు. ఇప్పుడు రెండో విడత భూముల పేరుతో కొంతమందిని వైసీపీ ఆఫీసుకు రప్పించుకుని, అమరావతి పరిరక్షణ కమిటీలంటూ డ్రామాలు ఆడటంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.
ఇక రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు ఏ ప్రతిపక్షానికైనా ఉంటుంది. కానీ, అసలు అమరావతిపై వైసీపీ అధికారిక స్టాండ్ ఏంటో చెప్పకుండా ఇలాంటి పర్యటనలు చేయడం వల్లే ఈ రచ్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటివరకు మూడు రాజధానులు అని, ఇవాళ మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ.. ముందుగా అమరావతి విషయంలో ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో, రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ వైసీపీ నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు, తీవ్ర ప్రతిఘటన తప్పవనేది తాజా ఘటనతో స్పష్టమవుతోంది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.