AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్ చేసే భూ బకాసురులు.. ఇప్పుడు ఏకంగా అధికార పీఠంలో ఉన్న పెద్దల ఆస్తులపైనే కన్నేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన కోట్ల విలువైన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కాజేయాలని చూసిన అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖపట్నంలో అత్యంత డిమాండ్ ఉన్న మధురవాడ ఏరియాలో రఘురామకృష్ణరాజుకు 1989 నుంచి 333.33 గజాల సొంత స్థలం ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లకు పైనే పలుకుతోంది. అయితే, ఈ ల్యాండ్ చాలా కాలంగా ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఓ కేటుగాళ్ల ముఠా దీనిపై కన్నేసింది. ఎలాగైనా ఈ భూమిని నొక్కేయాలని పక్కా స్కెచ్ వేసింది.

ap-news-raghurama-krishna-rajus-land-targeted-land-worth-₹2-crore-goes-missing

AP NEWS: రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన గ్యాంగ్..

ఈ వ్యవహారంలో నిందితులు వాడిన టెక్నిక్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన ఈ గ్యాంగ్.. నకిలీ సేల్ డీడ్స్ సృష్టించింది. అంతటితో ఆగకుండా, చట్టంలోని లొసుగులను వాడుకుంటూ అధికారుల కళ్లు గప్పి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు యాజమాన్య హక్కులను కూడా బదిలీ చేసేశారు. ఇదంతా తెరవెనుక అత్యంత రహస్యంగా జరిగిపోయింది.

ఇక కాగితాల మీద పని పూర్తయ్యాక, ప్రాక్టికల్‌గా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత నెల మే 25, 26 తేదీల్లో సదరు ముఠా సభ్యులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలో చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ జరుగుతున్న హడావుడిని గమనించిన రఘురామకృష్ణరాజు స్థానిక మిత్రుడు వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన రఘురామ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. ఒరిజినల్ పత్రాలను, సదరు ముఠా చూపిస్తున్న కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. అసలు మోసం బయటపడింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన స్థలాన్ని కొట్టేయాలని చూసినట్లు నిర్ధారణ అయింది.

ఈ భారీ భూ దందాపై రఘురామకృష్ణరాజు ప్రతినిధులు వైజాగ్ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 20న అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాక్షాత్తూ డిప్యూటీ స్పీకర్ ఆస్తికే నకిలీ పత్రాలు సృష్టించారంటే.. ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం అస్సలు తినొద్దు తెలుసా?

Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…

5 days ago

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…

5 days ago

This website uses cookies.