AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్ చేసే భూ బకాసురులు.. ఇప్పుడు ఏకంగా అధికార పీఠంలో ఉన్న పెద్దల ఆస్తులపైనే కన్నేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన కోట్ల విలువైన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కాజేయాలని చూసిన అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖపట్నంలో అత్యంత డిమాండ్ ఉన్న మధురవాడ ఏరియాలో రఘురామకృష్ణరాజుకు 1989 నుంచి 333.33 గజాల సొంత స్థలం ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లకు పైనే పలుకుతోంది. అయితే, ఈ ల్యాండ్ చాలా కాలంగా ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఓ కేటుగాళ్ల ముఠా దీనిపై కన్నేసింది. ఎలాగైనా ఈ భూమిని నొక్కేయాలని పక్కా స్కెచ్ వేసింది.

ap-news-raghurama-krishna-rajus-land-targeted-land-worth-₹2-crore-goes-missing

AP NEWS: రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన గ్యాంగ్..

ఈ వ్యవహారంలో నిందితులు వాడిన టెక్నిక్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన ఈ గ్యాంగ్.. నకిలీ సేల్ డీడ్స్ సృష్టించింది. అంతటితో ఆగకుండా, చట్టంలోని లొసుగులను వాడుకుంటూ అధికారుల కళ్లు గప్పి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు యాజమాన్య హక్కులను కూడా బదిలీ చేసేశారు. ఇదంతా తెరవెనుక అత్యంత రహస్యంగా జరిగిపోయింది.

ఇక కాగితాల మీద పని పూర్తయ్యాక, ప్రాక్టికల్‌గా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత నెల మే 25, 26 తేదీల్లో సదరు ముఠా సభ్యులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలో చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ జరుగుతున్న హడావుడిని గమనించిన రఘురామకృష్ణరాజు స్థానిక మిత్రుడు వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన రఘురామ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. ఒరిజినల్ పత్రాలను, సదరు ముఠా చూపిస్తున్న కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. అసలు మోసం బయటపడింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన స్థలాన్ని కొట్టేయాలని చూసినట్లు నిర్ధారణ అయింది.

ఈ భారీ భూ దందాపై రఘురామకృష్ణరాజు ప్రతినిధులు వైజాగ్ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 20న అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాక్షాత్తూ డిప్యూటీ స్పీకర్ ఆస్తికే నకిలీ పత్రాలు సృష్టించారంటే.. ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

2 weeks ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

2 weeks ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 weeks ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 weeks ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

2 weeks ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

2 weeks ago

This website uses cookies.