సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవడం, మరికొన్ని చోట్ల బలమైన స్థానాలపైనే దృష్టి పెట్టడం పార్టీల వ్యూహంగా ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని, ఎక్కడా ప్రత్యర్థులకు ఏకగ్రీవమయ్యే అవకాశం ఇవ్వకూడదని కేడర్కు ఖచ్చితమైన లైన్ ఇచ్చారు. పార్టీ ఉనికిని చాటడానికి ఇది అవసరమని అధిష్టానం భావిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ మాత్రం ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, అధికార పార్టీ ఉధృతిని తట్టుకుని ఎన్నికల బరిలో నిలవడం కత్తిమీద సామేనని కేడర్ భావిస్తోంది. పార్టీ లైన్ కోసం తాము ఆర్థికంగా నష్టపోవాలా అని ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనకడుగు వేస్తోంది. మరి జగన్ తీసుకున్న ఈ టాప్-టు-బాటమ్ పోటీ నిర్ణయం పార్టీని యాక్టివ్గా ఉంచుతుందా, లేక క్యాడర్లో మరింత అసంతృప్తిని రగిలిస్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన గండిపేటలో ఓ భారీ భూకుంభకోణం వెలుగుచూసింది.…
YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని…
AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ - ప్రొఫెసర్…
This website uses cookies.