Adipurush: యంగ్ రెబల్ స్ట్రార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఏకంగా 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. హిందీలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని అదిరిపోయే స్పందన వచ్చిన అంతకంటే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. రామాయణం కథని పూర్తిగా మార్చేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. కొంతమంది హిందూ సంఘాల వారు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పాత్రల చిత్రణ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ నాశిరకంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపద్యంలో మరల విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కూడా అంతగా రీచ్ అయ్యేలా లేదు. రాముడు బాహుబలి తరహాలో ఉన్నాడు అంటూ విమర్శించారు. అలాగే బొట్టు లేని సీతమ్మని చూపించారని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ రిలీజ్ కి గట్టిగా చూసుకుంటే 2 నెలల సమయం ఉంది.
ఇక ఈ మూవీ బిజినెస్ కోసం ఇప్పటికే భూషణ్ కుమార్ ఓపెన్ లో పెట్టారు. అయితే ఏ భాషలో కూడా మూవీ థీయాట్రికల్ బిజినెస్ క్లోజ్ కాలేదని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాని కొనడానికి ఎవరు ముందుకి రావడం లేదంట. ప్రేక్షకులకి ఈ సినిమాని రీచ్ చేయడంలో ఆశించిన స్థాయిలో ఇంకా చిత్రా యూనిట్ సక్సెస్ కాలేదు. అయితే మూవీపైన వెయ్యి కోట్ల కలెక్షన్స్ వరకు నిర్మాత ఆశిస్తున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఎవరు కూడా హక్కుల కోసం ముందుకి రాలేదు. కనీసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అమ్ముడుపోలేదు. దీంతో ఆదిపురుష్ నిర్మాత ఒకింత టెన్షన్ తో ఉన్నాడు అనే మాట వ్వినిపిస్తుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.