News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా ఉన్న ప్లాట్ ఫామ్ పై ఏమైనా కొనాలి అంటే సామాన్యుడికి జోబు చిల్లవాల్సిందే. మార్కెట్లో ఉన్న ధరలకు రైల్వే స్టేషన్లలో పలికే ధరలకు అసలు పొంతనే ఉండదు. వాటర్ బాటిల్ లను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ ఎవరికో బాగా కాలి ఈ భాగోతాన్ని బహిర్గతం చేశాడు. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్లపై దోపిడీ అంటూ ఏకంగా ట్విట్టర్లో మోత మోగించాడు. ఈ ట్వీట్ కు అధికారులే కదిలి సదరు వ్యాపారి కి జరిమానా విధించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) టీ స్టాల్ యజమానిపై సెంట్రల్ రైల్వే అధికారులు రూ. 50,000 జరిమానా విధించారు. లీటర్ వాటర్ బాటిల్ కు ఎక్కువ ఛార్జ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఆర్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు వెండర్ ఐడి కార్డు చూపించడంలో స్టాల్ యజమాని విఫలం కావడంతో అతనికి జరిమానా విధించారు.
ఏదైనా ఇష్యూ జరిగితే దానిపై స్పందించడం కాదని, అధికారులు అప్రమత్తంగా ఉండి సామాన్యులను దోచుకునే ఇలాంటి వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.