Categories: LatestNewsPolitics

YS Jagan: కూటమికి ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తోన్న ముఖ్యమంత్రి జగన్

YS Jagan: ఏపీ రాజకీయాలలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన రాజకీయ పోరు నడుస్తోంది. జనసేన బలం ఉన్న కూడా ఒంటరిగా నిలబడే శక్తి లేదు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. బీజేపీని కూడా తమ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా పొత్తులతో అందరిని ఏకం చేయడం ఇప్పుడు వైసీపీని టెన్షన్ పెడుతోంది. మూడు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేస్తే 2014 సీన్ రిపీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక టీడీపీ కూడా అదే ధీమాతో ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న ప్రజా వ్యతిరేకత అయితే వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ఉందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

అయితే టీడీపీ, జనసేన పొత్తుని ముఖ్యమంత్రి జగన్ అస్సలు అంగీకరించలేకపోతున్నారు. వారిని విడగొట్టడం సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆ కూటమి వైపు ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన భాగానే ఉన్నా కూడా ముఖ్యమంత్రి జగన్ నెలకి మూడు, నాలుగు ఏదో ఒక పథకం పేరుతో మీటింగ్ లు పెట్టి జనసేన, టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దుష్టశక్తులు అన్ని కలుస్తున్నాయి. తనని ఓడించడానికి అందరూ ఏకం అవుతున్నారు అంటూ పదే పదే చెబుతున్నారు.

ఈ విమర్శల ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అందరిని కూటమి వైపు మొగ్గేలా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అసలు టీడీపీ, జనసేన కలిసి పోరాటాలు చేయకుండానే ముఖ్యమంత్రి జగన్ వారికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇలా చేసిన విమర్శలనే మళ్ళీ మళ్ళీ చేస్తే అవి కాస్తా జగన్ కి రివర్స్ అవ్వడమే కాకుండా టీడీపీ, జనసేనపై ప్రజాక్షేత్రంలో ప్రజలకి నమ్మకం పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికలలో జగన్ ఓడిపోతే కచ్చితంగా అది వైసీపీ స్వయంకృతం కూడా అవుతుందని అంచనా వేస్తున్నారు.

Varalakshmi

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

1 hour ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

11 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

18 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.