Tea: టీ ఈ పేరు వింటేనే చాలామందికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి పనులలో నిమగ్నం అవుతూ ఉంటారు. అయితే చాలామంది టీ తయారు చేసేటప్పుడు వారి వారి స్టైల్ లో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే చాలామంది టీ మంచి రుచిగా సువాసనగా ఉండాలని ఎక్కువగా మరగనిస్తారు.
ఈ విధంగా టీ ఎక్కువసేపు మరగడం వల్ల చాలా రుచిగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కానీ టీ ఎక్కువ సేపు మరిగించడం వల్ల రుచిగా రావడం ఏమో కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీని 4 నిమిషాల కంటే ఎక్కువగా మరిగిస్తే కనుక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ ఇబ్బందులు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
టీలో చాలా టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలోకి ప్రవేశించే అనేక అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. టీని ఎక్కువసేపు అంటే నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. టానిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి మన శరీరంలోకి వెళ్లినటువంటి ఐరన్ ను శరీరం గ్రహించలేక పోతుంది.ఎక్కువగా మరిగించిన టీ మీలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు వస్తాయి. ఇది కాకుండా క్యాన్సర్కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు టీని ఎక్కువగా మరిగిస్తే ఏర్పడతాయి. ఇక రోగనిరోధక శక్తిపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అందుకే టి ఆరోగ్యంగా తాగాలి అంటే కేవలం నాలుగు నిమిషాలు మరిగిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.