Technology: మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పురోభివృద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు సంస్థలు తమ ఉత్పత్తుల యొక్క ప్రామాణికత, సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకొని మోసాలు చేయాలని అనుకునేవారు అదే పనిగా ప్రజలు విరివిగా ఉపయోగించే యాప్ లు, సాఫ్ట్ వేర్ లని రకరకాల ఇథికల్ వైరస్ లని ఉపయోగిస్తూ హ్యాక్ చేసేస్తూ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి తమ వినియోగదారులని కాపాడుకోవడానికి తమ ప్రోడక్ట్ పై యూజర్స్ నమ్మకాన్ని పెంచడానికి ఆయా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నాయి. మరింత అడ్వాన్స్ టెక్నాలజీ తో వినియోగదారులకి దగ్గర కావడానికి యూజర్ ఫ్రెండ్లీగా అప్డేట్స్ ఉండేలా శ్రద్ధ చూపిస్తున్నాయి. కస్టమర్ బేస్ పెంచుకునే మార్గంలో ఎప్పటికప్పుడు మార్పులని తీసుకొస్తూనే ఉన్నాయి.
ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో అత్యధిక యూజర్ బేస్ ఉన్న సోషల్ మీడియా మెసెంజర్ యాప్ వాట్సా యాప్ తన సాంకేతికని మరింత అడ్వాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికప్పుడు వాట్స్ యాప్ అప్డేట్స్ లో కొత్త కొత్త మార్పులు గమనిస్తూనే ఉన్నాం. అయితే త్వరలో వాట్స్ యాప్ కొంతమంది ఐవోఎస్ వినియోగదారులకి తమ సేవలని నిలిపివేయాలని భావిస్తుంది.
ముఖ్యంగా పాత ఐఫోన్ మోడల్స్ వాడే వారికి త్వరలో వాట్స్ యాప్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపెనీ కీలక ప్రకటన కూడా చేసింది. ఈ ఏడాది చివరినాటికి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 వెర్షన్స్ ఉన్న ఐ ఫోన్ లకి వాట్సాప్ మెసెంజర్ యాప్ పనిచేయదని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకటన నేపధ్యంలో పాత ఐఓఎస్ వెర్షన్స్ కలిగి ఉన్న ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ లని వీలైనంత వేగంగా అప్డేట్ చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త ఫోన్ లకి మారాల్సిందే.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.