Technology: మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పురోభివృద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు సంస్థలు తమ ఉత్పత్తుల యొక్క ప్రామాణికత, సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకొని మోసాలు చేయాలని అనుకునేవారు అదే పనిగా ప్రజలు విరివిగా ఉపయోగించే యాప్ లు, సాఫ్ట్ వేర్ లని రకరకాల ఇథికల్ వైరస్ లని ఉపయోగిస్తూ హ్యాక్ చేసేస్తూ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి తమ వినియోగదారులని కాపాడుకోవడానికి తమ ప్రోడక్ట్ పై యూజర్స్ నమ్మకాన్ని పెంచడానికి ఆయా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నాయి. మరింత అడ్వాన్స్ టెక్నాలజీ తో వినియోగదారులకి దగ్గర కావడానికి యూజర్ ఫ్రెండ్లీగా అప్డేట్స్ ఉండేలా శ్రద్ధ చూపిస్తున్నాయి. కస్టమర్ బేస్ పెంచుకునే మార్గంలో ఎప్పటికప్పుడు మార్పులని తీసుకొస్తూనే ఉన్నాయి.
ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో అత్యధిక యూజర్ బేస్ ఉన్న సోషల్ మీడియా మెసెంజర్ యాప్ వాట్సా యాప్ తన సాంకేతికని మరింత అడ్వాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికప్పుడు వాట్స్ యాప్ అప్డేట్స్ లో కొత్త కొత్త మార్పులు గమనిస్తూనే ఉన్నాం. అయితే త్వరలో వాట్స్ యాప్ కొంతమంది ఐవోఎస్ వినియోగదారులకి తమ సేవలని నిలిపివేయాలని భావిస్తుంది.
ముఖ్యంగా పాత ఐఫోన్ మోడల్స్ వాడే వారికి త్వరలో వాట్స్ యాప్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపెనీ కీలక ప్రకటన కూడా చేసింది. ఈ ఏడాది చివరినాటికి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 వెర్షన్స్ ఉన్న ఐ ఫోన్ లకి వాట్సాప్ మెసెంజర్ యాప్ పనిచేయదని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకటన నేపధ్యంలో పాత ఐఓఎస్ వెర్షన్స్ కలిగి ఉన్న ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ లని వీలైనంత వేగంగా అప్డేట్ చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త ఫోన్ లకి మారాల్సిందే.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.