Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీలు, ఫేమస్ పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. వేణు స్వామి అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య డివోర్స్ తీసుకుంటారని చెప్పి వర్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో ప్రజలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభాస్ టైం బాగోలేదని, ఆయన జాతకం ప్రకారం సినిమాలు పెద్దగా హిట్ కావని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికిగురై సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో జాతకం చెప్పించుకునేందుకు క్యూలు కట్టారు. ఆయనతో స్పెషల్ పూజలు చేయించుకున్నారు. ఇక ప్రభాస్ జాతకం చెప్పి వేణు స్వామి పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు. ఈ మధ్యనే ప్రభాస్ ఏ సినిమా చేసినా హిట్ కాదు ఆయనతో సినిమా చేసేవారు జాతకం చూపించుకోవాలి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయితే లేటెస్టుగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి వేణు స్వామి హాట్ టాపిక్ అయ్యాడు. వేణు స్వామి ఇక జ్యోతిష్యం చెప్పడం మానుకో అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన్ని ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు.
అందరి స్టార్ లాగే వేణు స్వామి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ జాతకం చెప్పాడు. అయితే ఆయన జాతకంలో దోషం ఉందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వేణు స్వామి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో ఎన్టీఆర్ తల్లి షాలినిని కలిశాను. ఆమెతో ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడాను. ఆమె ఎన్టీఆర్ జాతకం తెలుసుకుని షాక్ అయ్యారు. పుట్టుకతోనే ఒక పెద్ద ప్రాబ్లమ్తో ఎన్టీఆర్ పుట్టారని వివరించాను. అయితే ఆమెకు ఎన్టీఆర్ కు దోషమున్నట్లుగా తెలుసట. అంత కరెక్ట్ గా ఎన్టీఆర్ జాతకం చెప్పడంతో ఆమె షాక్ అయ్యారు. ఆ సమస్య ఏంటో నాకు తెలుసని చెప్పాను. ఆయనకున్న దోషం గురించి వివరించాను. ఎన్టీఆర్ కు ఈ దోషం ఉన్నట్లు కేవలం సీనియర్ ఎన్టీఆర్ కు , తనకు మాత్రమే తెలుసని చెప్పారు. మీకు ఈ విషయం ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయారు.
“జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రం. అదే నక్షత్రంలో జయలలిత పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. రాజకీయాల్లోకి రానివ్వకుండా ఎన్టీఆర్ తల్లి అడ్డుపడుతున్నారు. తాత సీనియర్ ఎన్టీఆర్ కి ఎలా రాజయోగం ఉండేదో రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా అదే రాజ యోగం పడుతుంది. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏ సినిమా అయినా విజయవంతమవుతుంది.” ” అని వేణు స్వామి చెప్పారు. అయితే ఆ దోషం ఏమిటో అది మాత్రం తెలపలేదు వేణు స్వామి. దీంతో అభిమానుల్లో టెర్షన్ మొదలైంది.
AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
This website uses cookies.