vani-jayaram-death-mystery
Vani Jayaram: సినీ నేపధ్య గాయని వాణి జయరాం చెన్నైలో తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అనారోగ్యంతో మరణించింది అని ముందు బయటకి వచ్చింది. తర్వాత ఆమె తలపై బలమైన గాయాలు ఉన్నాయని, వాణి జయరాంకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె పని మనిషి పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాను ఎప్పటిలాగే ఇంటికి వెళ్లేసరికి తలుపులు వేసి ఉన్నాయని, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూస్తే ఆమె చనిపోయి ఉందని పనిమనిషి తెలియజేసింది. ఇక ఆమె ఫిర్యాదుతో పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే వాణిజయరాం ఈ ఏడాది పద్మావిభూషణ్ పురస్కారానికి ఎంపికైంది.
అయితే ఆ అవార్డుని అందుకునే లోపే ఆమె ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఇక భారతీయ భాషలలో ఏకంగా 20 వేలకి పైగా పాటలని వాణి జయరాం ఆలపించారు. అలాగే ఎన్నో భక్తిగీతాలు కూడా పాడారు. అయితే చాలా కాలంగా ఆమెని పాటలకి దూరంగా ఉన్నారు. ఒంటరిగా చెన్నైలో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మృతి మిస్టరీగా మారింది. ఇక తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాణి జయరాం తలపై బలమైన గాయం ఉందని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో నివేదిక రావడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ఇక ఆ నివేదిక ఆధారంగా కేసుని హత్య లేదంటే సహజసిద్ధమైన మరణమా అనేది నిర్ధారిస్తారు. మరో వైపు ఆమె ఆస్తిపాస్తులు, అదే సమయంలో ఈ మధ్యకాలంలో ఆమెని ఎవరైనా కలుసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పద్మవిభూషణ్ రావడంతో ఆమెకి అభినందనలు తెలపడానికి తరుచుగా ఎవరో ఒకరు ఆమె ఇంటికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమెది హత్య అని పనిమనిషి అనుమానిస్తున్న ఎవరికి ఆమెని చంపే అంత పగ ఉంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక లెజెండ్రీ గాయని ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.