Vadi Biyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఒడి బియ్యం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లయిన మహిళలకు ప్రతి ఏడాది తమ పుట్టింటి వారు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా తమ కూతురికి కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తుంటారు. అయితే ఇలా వడి బియ్యం పోయడానికి కారణం ఏంటి… ఒడి బియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
మహాలక్ష్మిగా భావించి తన అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెకు ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వారు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది.తల్లి ఒడి అంటే రక్షణకు నిలయమని భావిస్తారు. మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల తమ కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారని ఈ విధంగా ప్రతి ఏడాది వడి బియ్యం పోయడం వల్ల తమ కుమార్తె ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా తన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా వెల్లు వెరుస్తాయని భావించి తల్లిదండ్రులు కుమార్తెకు ఒడిబియ్యం పోస్తారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.