Vadi Biyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఒడి బియ్యం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లయిన మహిళలకు ప్రతి ఏడాది తమ పుట్టింటి వారు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా తమ కూతురికి కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తుంటారు. అయితే ఇలా వడి బియ్యం పోయడానికి కారణం ఏంటి… ఒడి బియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
మహాలక్ష్మిగా భావించి తన అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెకు ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వారు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది.తల్లి ఒడి అంటే రక్షణకు నిలయమని భావిస్తారు. మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల తమ కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారని ఈ విధంగా ప్రతి ఏడాది వడి బియ్యం పోయడం వల్ల తమ కుమార్తె ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా తన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా వెల్లు వెరుస్తాయని భావించి తల్లిదండ్రులు కుమార్తెకు ఒడిబియ్యం పోస్తారు.
Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…
Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…
Curd: వర్షాకాలంలో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతాయి కనుక చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ…
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.…
Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…
Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…
This website uses cookies.