Tollywood: ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అందులో దంగల్ హైయెస్ట్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 3, నాలుగో స్థానంలో పఠాన్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వంద కోట్లు కలెక్షన్స్ అందుకోవడమే సంచలనంగా భావించే ఇండియన్ సినిమా మార్కెట్ ఇప్పుడు వెయ్యి కోట్లకి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే సినిమాల బడ్జెట్ కూడా 500 కోట్లకి చేరుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ కూడా 5 వందల కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి సినిమా బడ్జెట్ కూడా ఐదు వందల కోట్లకి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైర్ 2 హీరోలు చేస్తున్న సినిమాల బడ్జెట్ కూడా వంద కోట్లకి చేరిపోయింది. అయితే ఈ బడ్జెట్ లని బాలీవుడ్ నిర్మాతలు అయితే ఇంకా అందుకోలేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే నెక్స్ట్ టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లని దాటి కలెక్షన్స్ చేయగల సత్తా ఉన్న సినిమాలు ఏవి ఉన్నాయి అని చూసుకుంటే ముందు స్థానంలో సలార్ మూవీ ఉంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఉంటుంది.
తరువాత ప్రాజెక్ట్ కె సినిమాకి కూడా ఆ సత్తా ఉంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి రెండు వేల కోట్లుని అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా వెయ్యి కోట్లని దాటే ఛాన్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో వెయ్యి కోట్ల ఫీట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ, తారక్, కొరటాల మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.