Tollywood: సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బాలయ్య కూతురు బ్రాహ్మణి నటించబోతుందా..? అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, వాస్తవానికి ఇది ఇప్పటి విషయం కాదు. 15 ఏళ్ళ క్రితం నాటి మాట అట. 2005 లో మహేశ్ బాబు హీరోగా అతడు సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నటుడు నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు.
మహేశ్ కెరీర్లోనే మంచి సినిమాగా నిలిచిన ఈ చిత్రం ఆశించిన వసూళ్ళను మాత్రం రాబట్టలేకపోయింది. కారణం ఓవర్ బడ్జెట్. దీనికి కారణం కూడా దర్శకుడే అని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఆ విషయం అలా పక్కన పెడితే, మహేశ్ సరసన అతడు సినిమాలో నటించాల్సిన హీరోయిన్ బాలయ్య కూతురు బ్రాహ్మణి అట. బాలయ్యను చాలామంది మీ అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయవచ్చు కదా..అని అడిగారట.
బ్రాహ్మణి హీరోయిన్స్ కంటే ఏమాత్రం తీసిపోదు. అందానికి అందం టాలెంట్ అన్నీ ఉన్నాయి. అయితే, సినిమాలంటే మాత్రం ఆసక్తి లేదట. సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూస్తుంది గానీ, సినిమాలో హీరోయిన్గా మాత్రం నటించే ఇంట్రెస్ట్ లేదని ముందు నుంచి చెప్పిందట. అందుకే బాలయ్య ఏనాడు బ్రాహ్మణి ని సినిమాలలో నటిస్తావా..? అని అడగలేదట. అతడు కోసం మహేశ్ బాబు సరసన బ్రాహ్మణి ని అనుకొని ఆమె నో అనగానే నెక్స్ట్ ఛాయిస్ గా త్రిష ని ఫిక్స్ చేసుకున్నారట.
ఇక బ్రాహ్మణి గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. గోల్డ్ మెడల్ సాధించింది. బాలయ్య మాట ఏనాడు దాటలేదు. మిగతా వారిలాగా ప్రేమ వ్యవహారం నడపలేదు. నారా వారి ఇంటికి కోడలైంది. లోకేశ్ భార్యగా ఆ ఇంట్లో అన్నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది. పొలిటికల్ పరంగా కూడా బ్రాహ్మణి ఎంతో చురుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వస్తే గనక రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.