Tirumala: కలియుగ దైవం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని ఇలవైకుంఠంగా పరిగణిస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రజలు సుదూర ప్రదేశాల నుండి తిరుమలకు చేరుకుంటారు. అయితే భక్తుల సౌకర్యం టిటిడి ఎప్పటికప్పుడు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టిటిడి స్పష్టం చేసింది.
సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చివరి గడువు రోజున మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. అయితే ఈ టికెట్లు పొందిన వారు టిటిడి నిర్ణయించిన ధర చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే కోటా:వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత దర్శనం కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
అలాగే మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, అలాగే తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ లో ఈ ఆన్ లైన్ కోటా ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్ల తో పాటు వసతి కోటాను బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.