Categories: DevotionalLatestNews

Tirumala: టోల్ పాస్ పై కేంద్రం కీలక నిర్ణయం..ఫాస్టాగ్ తప్పనిసరి!

Tirumala: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్‌లపై కేంద్ర ప్రభుత్వం తరచూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగాలని ఉద్దేశించిన ఈ చర్యలు, మరోవైపు వాహనదారులపై భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం అన్ని టోల్ ప్లాజాలలో వాహనాల నుంచి ఫాస్టాగ్‌ విధానంతో టోల్ వసూలు జరుగుతున్నా, వాస్తవంగా వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు.

ఫాస్టాగ్ రీడర్లు పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి తరచూ జరుగుతుండటంతో, కొన్ని సందర్భాల్లో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు క్యూల్లో నిలబడుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా కూడా రాకపోకలు అంత సజావుగా లేవన్న అభిప్రాయం కేంద్రానికి వచ్చింది. దీంతో కేంద్రం కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

ఇకపై వాహనదారులకు వార్షిక టోల్ పాస్‌ సౌకర్యం లభిస్తుంది. దీని ధర రూ.3,000గా నిర్ణయించబడింది. పాస్‌ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 ట్రిప్పుల వరకు ఇది చెల్లుతుంది. అయితే ఈ సదుపాయం కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు) మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్‌ వర్తించదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానున్నట్టు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

tirumala-the-centers-key-decision-on-toll-passes-fastag-is-mandatory

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది.

ఇదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ నెల 15 నుంచి అలిపిరి చెక్‌పోస్ట్ వద్దకు వచ్చే అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ ఉండాలి. భద్రత, రద్దీ తగ్గింపు, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమల గిరి ప్రాంతంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఫాస్టాగ్ లేని వాహనదారుల కోసం అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ భక్తులు తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ పొందవచ్చు. దానిని పొందిన తర్వాత మాత్రమే వాహనాలతో తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయంలో సహకరించాలని కోరింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు!

RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…

1 day ago

Puranapanda Srinivas: ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

3 days ago

P. Sunil Kumar Reddy: మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్.!

P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…

5 days ago

Ram Charan: పెద్ది ఐటం సాంగ్ కోసం ఇంతమంది స్టార్ హీరోయిన్సా?

Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…

6 days ago

M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్?

M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…

6 days ago

Puranapanda Srinivas: మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!

Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…

1 week ago

This website uses cookies.