Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎప్పటిలాగే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లు భక్తులతో నిండి పోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు విస్తరించాయి.
టీటీడీ అధికారులు చెప్పిన వివరాల మేరకు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు సుమారు 18 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. వేసవి సెలవులు దాదాపు పూర్తి అయి తిరిగి స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైనప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే ఏకంగా 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 42,566 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లకు చేరగా, టీటీడీ 4.34 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు ఉదయానికే పూర్తయ్యాయి. దీంతో ముందస్తు టోకెన్లు లేని భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ అధికారులు ఏ విధమైనటువంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం ఆహారం తాగునీరు పాలు వంటి పదార్థాలను అందచేసేలా ఏర్పాటను నిర్వహించారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.