Corona Virus: గత రెండేళ్ళ కాలంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. లక్షలాది ప్రజలు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉన్న, ఇతర దేశాలలో మాత్రం లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాలలో అయితే కరోనాతో చనిపోయిన వారిని మూకుమ్మడిగా గుంతలు తీసి పాతిపెట్టారు అంటే పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.చైనా, అమెరికా, రష్యా, కెనడా లాంటి దేశాలలో కరోనా విలయతాండవం చేసింది. ఇక భారత్ లో కూడా కరోనా సృష్టించిన విధ్వంసంతో ప్రజలు ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోయారు. కనీసం మూడు పూటల తినలేని దైన్యస్థితిలోకి చాలా మంది వెళ్ళిపోయారు.
ఇక ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ కరోనా భయానక జ్ఞాపకాల నుంచి బయటకి వస్తుంది. మళ్ళీ ప్రజలు మామూలు జీవితంలోకి వచ్చి, భయాన్ని వదిలేసి జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికి కరోనా మనతో పాటు సహవాసం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి చైనాతో కరోనా ప్రభావం కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకి వచ్చిందని, ఇది మానవ సృష్టి అని ప్రపంచంలో చాలా దేశాలు నమ్ముతున్నాయి. వూహాన్ లో వైరాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఒక చైనా శాస్త్రవేత్త ఈ విషయాన్ని వీడియో రూపంలో బయటపెట్టిన రెండో రోజే కనిపించకుండా పోయాడు. అయితే చాలా కాలం తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో మరణించడం విశేషం.
కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో ప్రయోగాల ద్వారా ఊపిరి పోసుకున్నదేనని నిర్ధారించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అమెరికా అందించిన నిధులతోనే ఈ వైరస్ ని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో జన్యుపరంగా సృష్టించారని పేర్కొన్నారు. ఆ ల్యాబ్ నుంచి ఇది వూహాన్ లో ముందుగా బయటకి వచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు అండ్రూ హాఫ్ రాసిన పుస్తకం వైరల్ గా మారింది. అయితే దీనిపై చైనా ఎలాంటి సమాధానం చెబుతుంది అనేది ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.