Categories: LatestMost ReadNews

Politics: టీఆర్ఎస్ కి విశ్వాస పరీక్ష… కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే

Politics: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసి గట్టిగా ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారు. ఇక ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు సైతం భారీ ఆధిక్యంతో పట్టం కట్టారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ని గద్దె ఎక్కించారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలని గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అస్సలు గుర్తించలేదు. తాము త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ప్రజలు భావించారు.

ఈ తెలంగాణ సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అయితే రెండో సారి ముందస్తు ఎన్నికలకి వెళ్ళడంతో పాటు మరోసారి తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా నాయకుల పెత్తనం అనే అంశాలని తెరమీదికి తీసుకొచ్చిన కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మెజారిటీ తగ్గినా కూడా మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు.

అయితే రెండో సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం మరింత తగ్గిపోయింది. బీజేపీ పార్టీకి ప్రజలు కొన్ని అసెంబ్లీ స్థానాలని ఇచ్చారు. దీంతో తెలంగాణలో బలపడటానికి ఉన్న అవకాశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కరెక్ట్ గా ఓడిసిపట్టుకుంది. అగ్రిసివ్ గా ఉండే బండి సంజయ్ లాంటి వ్యక్తికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి మెల్లగా అడుగులు వేసుకుంటూ బీజేపీ పార్టీ ప్రజాబలం పెంచుకోవడం మొదలు పెట్టింది. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం, గ్రూప్ రాజకీయాల కారణంగా ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టడం మొదలు పెట్టారు.

టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానం బీజేపీకి ఇచ్చేసారు. ఇక రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీకి పట్టం పట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలతో ముందుకెళ్ళిన బీజేపీకే విజయం వరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీజేపీ సత్తా చూపిస్తూ వచ్చింది. తెలంగాణలో తమకి తిరుగులేదని అనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ పార్టీ రూపంలో పెద్ద ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొంచి ఉంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ తన వ్యూహాలని మార్చుకొని రాష్ట్ర నాయకత్వ బాధ్యతని కేటీఆర్ కి అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నం మొదలు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్ గా మార్చేశారు. అయితే బీజేపీ మాత్రం తనకి అలవాటైన రిలీజియన్ సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది.

ఒవైసీ లాంటి నాయకుడిని అడ్డుకోవాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందనే సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇక అసలు డిపాజిట్ కూడా రాని స్థాయి నుంచి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ సత్తా పెంచుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీకి విజయం వరించకున్న ప్రజలు రెండో స్థానం ఇచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. దీనిని బట్టి మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాస పరీక్షలో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకొని నమ్మకం పెంచుకోవాలి. లేదంటే ఈ సారి బీజేపీ రూపంలో గండాన్ని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

16 hours ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

16 hours ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

19 hours ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

20 hours ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

20 hours ago

Parama Ekadashi : నేడే పరమ ఏకాదశి.. మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు..ఇలా పూజ చేస్తే చాలు ..

Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…

21 hours ago

This website uses cookies.