TDP: ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మరోసారి 2024 లో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఓవైపు జనసేనతో పొత్తుల సమీకరణాలు నడుపుతూనే మరోవైపు ఒంటరిగా పోటీ చేసిన కూడా అధికారంలోకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ క్యాడర్ ను బలంగా జనంలోకి పంపిస్తున్నారు. ఓ విధంగా ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ చూసుకుంటే ప్రతిపక్ష తెలుగుదేశానికి ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు.
దీంతో తమ పార్టీకి ప్రజల్లో బలం పెరిగిందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీకి ప్రత్యామ్నాయంగా తమనే మరల ప్రజలు కోరుకుంటున్నారని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే సమయంలో జనసేన పార్టీ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుకోవడంతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో సంస్థాగత నిర్మాణం లేని పవన్ కళ్యాణ్ కి అధికార భాగస్వామి ఇచ్చేది లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడం సంచలనంగా మారింది.
అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. పొత్తు పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకొని పోటీ చేయాలని లేదంటే ఒంటరిగా వెళ్లి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని సీరియస్ గా రియాక్ట్ కావడం లేదు. జనసేన పార్టీ లేకుండా ఒంటరిగా పోటీ చేసే దమ్ము తెలుగుదేశంకి లేదని వారందరూ భావిస్తున్నారు. అయితే చంద్రబాబు అండ్ కొ జనసేనకు శాసించే ఛాన్స్ ఇవ్వకూడదని ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.