tdp-leaders-worrying-about-jumping-leaders-from-ycp
AP Politics: అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకి అసమ్మతి నాయకులూ పెరిగిపోతున్నారు. సుమారు 50 మందికి పైగా బయటకి చెప్పకపోయిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటిని కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్స్ కి పడేలా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో హామీ ఇచ్చిన పనులని కూడా ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. దీంతో వారిలో తెలియని అసహనం నెలకొని ఉంది. అయితే అభివృద్ధి చేయకుండా ఇంటింటికి వెళ్లి జగనన్న అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పమని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకి ఫోర్స్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్గతంగా ఇప్పటికే వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి జ్వాలలు నెల్లూరు జిల్లాలో మొదటిగా బయటపడ్డాయి. మెల్లగా మిగిలిన జిల్లాలకి కూడా విస్తరిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వచ్చే ఎన్నికలలో కనీసం 50 మంది సిట్టింగ్ లకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలలో కూడా వినిపిస్తుంది. అయితే వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు దిక్కులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో అసంతృప్తుల కారణంగా ఇప్పుడు ఎక్కడ తమ స్థానాలు గల్లంతు అవుతాయో అని ఇన్ని రోజులు పార్టీకి ఇన్ చార్జ్ లు పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. ఈ వైసీపీ వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ చేరికలపై రియాక్ట్ కానంత వరకు సైలెంట్ గా ఉండాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక టీడీపీలో సీట్లు రావు అనుకున్నవారు జనసేన వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద…
AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం.…
Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో…
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా…
This website uses cookies.