tdp-leaders-worrying-about-jumping-leaders-from-ycp
AP Politics: అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకి అసమ్మతి నాయకులూ పెరిగిపోతున్నారు. సుమారు 50 మందికి పైగా బయటకి చెప్పకపోయిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటిని కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్స్ కి పడేలా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో హామీ ఇచ్చిన పనులని కూడా ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. దీంతో వారిలో తెలియని అసహనం నెలకొని ఉంది. అయితే అభివృద్ధి చేయకుండా ఇంటింటికి వెళ్లి జగనన్న అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పమని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకి ఫోర్స్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్గతంగా ఇప్పటికే వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి జ్వాలలు నెల్లూరు జిల్లాలో మొదటిగా బయటపడ్డాయి. మెల్లగా మిగిలిన జిల్లాలకి కూడా విస్తరిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వచ్చే ఎన్నికలలో కనీసం 50 మంది సిట్టింగ్ లకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలలో కూడా వినిపిస్తుంది. అయితే వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు దిక్కులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో అసంతృప్తుల కారణంగా ఇప్పుడు ఎక్కడ తమ స్థానాలు గల్లంతు అవుతాయో అని ఇన్ని రోజులు పార్టీకి ఇన్ చార్జ్ లు పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. ఈ వైసీపీ వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ చేరికలపై రియాక్ట్ కానంత వరకు సైలెంట్ గా ఉండాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక టీడీపీలో సీట్లు రావు అనుకున్నవారు జనసేన వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.