tdp-leaders-worrying-about-jumping-leaders-from-ycp
AP Politics: అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకి అసమ్మతి నాయకులూ పెరిగిపోతున్నారు. సుమారు 50 మందికి పైగా బయటకి చెప్పకపోయిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటిని కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్స్ కి పడేలా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో హామీ ఇచ్చిన పనులని కూడా ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. దీంతో వారిలో తెలియని అసహనం నెలకొని ఉంది. అయితే అభివృద్ధి చేయకుండా ఇంటింటికి వెళ్లి జగనన్న అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పమని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకి ఫోర్స్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్గతంగా ఇప్పటికే వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి జ్వాలలు నెల్లూరు జిల్లాలో మొదటిగా బయటపడ్డాయి. మెల్లగా మిగిలిన జిల్లాలకి కూడా విస్తరిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వచ్చే ఎన్నికలలో కనీసం 50 మంది సిట్టింగ్ లకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలలో కూడా వినిపిస్తుంది. అయితే వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు దిక్కులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో అసంతృప్తుల కారణంగా ఇప్పుడు ఎక్కడ తమ స్థానాలు గల్లంతు అవుతాయో అని ఇన్ని రోజులు పార్టీకి ఇన్ చార్జ్ లు పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. ఈ వైసీపీ వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ చేరికలపై రియాక్ట్ కానంత వరకు సైలెంట్ గా ఉండాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక టీడీపీలో సీట్లు రావు అనుకున్నవారు జనసేన వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…
SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
This website uses cookies.