AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు మూడు కూడా రానున్న ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలు వేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ ఇప్పటికే జనంలోకి వెళ్ళింది. ఇక వైసీపీ సంక్షేమ పథకాలని నమ్ముకుంటుంది. అలాగే మార్చి 18 నుంచి ప్రజలలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. సంక్షేమ పథకాలే తమని మళ్ళీ గెలిపిస్తాయని వైఎస్ జగన్ నమ్ముతున్నారు. అయితే `ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఈ సారి అధికారం తమదే అని టీడీపీ భావిస్తుంది. ఇక ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న నేపధ్యంలో కచ్చితంగా తమకి బలమైన స్థానాలు లభిస్తాయని జనసేన భావిస్తుంది.
ఇలా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆత్మసాక్షి సర్వేతో ఏపీలో టీడీపీ వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలిచి మొదటిస్థానంలో ఉంటుందని పేర్కొంది. అలాగే వైసీపీకి 63 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక జనసేన 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అయితే జనసేన బలం ఈ సారి భాగా పెరిగిందని, కావాలని చూపించే ప్రయత్నం చేయడం లేదని ఆ పార్టీ నాయకుల మాట. ఇదిలా ఉంటే జనసేన, టీడీపీ వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని అందరూ భావిస్తున్నారు.
ఇక జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే కచ్చితంగా 130 స్థానాల వరకు గెలుచుకుంటుంది అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోష్యం చెప్పారు. ఆత్మసాక్షి సర్వే చెప్పిన 63 స్థానాలలో కూడా మా పార్టీ గెలిచే అవకాశం లేదని 20, 30 స్థానాలకి పరిమితం అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఇక జనసేన కూడా పొత్తులో భాగంగా టీడీపీని 50 స్థానాలు అడుగుతుంది. అయితే ఆ పార్టీ 35 స్థానాలు ఇవ్వడానికి ఫైనల్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది.
Telangana: అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క చక్కటి పేరును సూచించడం ద్వారా అక్షరాలా ఒక లక్ష…
AP POLITICS: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒకరినొకరు నామరూపాలు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కూటమి ప్రభుత్వంలో త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో…
Tollywood: టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్…
Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం…
Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది.…
This website uses cookies.