Categories: Tips

AP Politics: టీడీపీ, జనసేన కలిస్తే 130 సీట్లు… రఘురామ జోష్యం

AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు మూడు కూడా రానున్న ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలు వేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ ఇప్పటికే జనంలోకి వెళ్ళింది. ఇక వైసీపీ సంక్షేమ పథకాలని నమ్ముకుంటుంది. అలాగే మార్చి 18 నుంచి ప్రజలలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. సంక్షేమ పథకాలే తమని మళ్ళీ గెలిపిస్తాయని వైఎస్ జగన్ నమ్ముతున్నారు. అయితే `ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఈ సారి అధికారం తమదే అని టీడీపీ భావిస్తుంది. ఇక ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న నేపధ్యంలో కచ్చితంగా తమకి బలమైన స్థానాలు లభిస్తాయని జనసేన భావిస్తుంది.

ఇలా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆత్మసాక్షి సర్వేతో ఏపీలో టీడీపీ వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలిచి మొదటిస్థానంలో ఉంటుందని పేర్కొంది. అలాగే వైసీపీకి 63 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక జనసేన 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అయితే జనసేన బలం ఈ సారి భాగా పెరిగిందని, కావాలని చూపించే ప్రయత్నం చేయడం లేదని ఆ పార్టీ నాయకుల మాట. ఇదిలా ఉంటే జనసేన, టీడీపీ వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని అందరూ భావిస్తున్నారు.

 

ఇక జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే కచ్చితంగా 130 స్థానాల వరకు గెలుచుకుంటుంది అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోష్యం చెప్పారు. ఆత్మసాక్షి సర్వే చెప్పిన 63 స్థానాలలో కూడా మా పార్టీ గెలిచే అవకాశం లేదని 20, 30 స్థానాలకి పరిమితం అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఇక జనసేన కూడా పొత్తులో భాగంగా టీడీపీని 50 స్థానాలు అడుగుతుంది. అయితే ఆ పార్టీ 35 స్థానాలు ఇవ్వడానికి ఫైనల్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

21 hours ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

21 hours ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

Ashada Masam: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తున్నారా? అస్సలు చేయొద్దు..

Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…

3 days ago

This website uses cookies.