Categories: LatestNews

Swapnalok Complex: అంతులేని విషాదం… పొగలో కలిసిపోయిన ప్రాణాలు

Swapnalok Complex:  సికింద్రాబాద్ లో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని`ప్రమాదంలో అంతులేని విషాదం మిగిలింది. ఈ ప్రమాదంలో పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక ఏకంగా ఆరు మంది మృతి చెందారు. అయితే ఈ ఆరుగురు ఒకే కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్న వారు కావడం విశేషం. ఆరుగురు కూడా ఒకే గదిలో చిక్కుకొని ఊపిరి ఆడక ఒకరి కళ్ళముందు ఒకరు మరణంతో పోరాటం చేస్తూ చివరికి మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఈ విషాదం మరోసారి హైదరాబాద్ లో ఎత్తైన భవంతులలో ఫైర్ సేఫ్టీపై ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రతి చోట సూచిస్తుంది. అయితే ఈ చనిపోయిన వారిలో నలుగురు అమ్మాయిలు ఉండటం విశేషం.  త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌.

వీరందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. కుటుంబానికి సాయంగా `ఉందామని భాగ్యనగరానికి వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు ఉద్యోగం వచ్చింది. అయితే ఇదొక చట్టవిరుద్ధమైన కంపెనీ అనే విషయం వారికి తెలియదు. కాని డబ్బులు కడితే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు చెప్పిన మాటలని నమ్మారు. కుటుంబాన్ని అడిగి ఒక్కొక్కరు రెండు లక్షల వరకు తీసుకొచ్చి చెల్లించారు. ఉద్యోగాలలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. వారు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నది కూడా వారికి అర్ధం కాని పరిస్థితి. అలాగే తాము చేస్తున్న కంపెనీ ఎవరిది అనే సమాచారం కూడా వారి దగ్గర లేదు.

క్యూ నెట్ అనే మల్టీ మార్కెటింగ్ కంపెనీ మీద నిషేధం ఉండటంతో ఆ సంస్థ తన పేరు మార్చుకొని మళ్ళీ కార్యకలాపాలు మొదలు పెట్టింది. అందులో పని చేస్తున్న వారే వీరంతా. అయితే తమ కంపెనీలు ఏకంగా ఆరుమంది ఉద్యోగులు చనిపోయిన కూడా సంస్థ ప్రతినిధులుగా ఒక్కరు కూడా బయటకి రాకపోవడం చూస్తుంటే దీని వెనుక ఎంత మోసం ఉందనేది అంచనా వేయొచ్చు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ఆరుమంది మరణానికి బాధ్యులు ఎవరు. వారి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేది ఎవరు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న

Varalakshmi

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

1 hour ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

1 hour ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

This website uses cookies.