Inspiring: ప్రపంచంలోనే అతిపెద్ద విభిన్నమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయి. ఈ విస్తారమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోని కొన్ని స్టార్టప్లు తమ పరిశ్రమను విస్తరించడం కోసమే కాకుండా కొన్ని సమాజంపై ప్రభావం చూపే కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రజలకు త్వరిత, సులభతరమైన, సరసమైన న్యాయం అందించాలనే దృక్పథంతో ఏర్పడిన న్యాయకర్త అనే సామాజిక ప్రభావ స్టార్టప్ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే వేదిక అయిన రాజ్మంచ్కు ప్రస్తుత అధ్యక్షుడైన శుభమ్ శర్మ న్యాయకర్త స్టార్టప్ కంపెనీని స్థాపించారు. శుభమ్ శర్మకు రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగానూ ఈయనకు పేరుంది. పబ్లిక్ పాలసీ నిపుణుడిగా కూడా పనిచేస్తున్నారు.
త్వరితమైన, సులభమైన, సరసమైన న్యాయం అందించాలనే దృక్పథంతో ప్రారంభించబడిని స్టార్టప్ కంపెనీ న్యాయకర్త. శుభమ్ శర్మ ప్రముఖ జాతీయ , ప్రాంతీయ రాజకీయ నాయకులతో వ్యూహకర్తగా పని చేస్తున్నప్పుడు, ప్రభుత్వాలు వారి పథకాలను అమలు చేయడంలో సహాయం చేస్తున్నప్పుడు, ప్రజలు తమ గొంతుకలను వినిపించడంలో విపరీతమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారో గమనించారు. అప్పుడే అతను గ్రౌండ్-లెవల్ లో తీసుకురావాల్సిన మార్పు అవసరాన్ని గుర్తించాడు.
న్యాయకర్త త్వరిత, సులభమైన న్యాయాన్ని పొందడం కోసం ఒక అధునాతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఏర్పడింది. ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా 500లకు పైగా ఎంపిక చేసిన న్యాయ మరియు మానవ హక్కుల నిపుణుల బృందం ఈ కంపెనీలో పనిచేస్తోంది. వారు ప్రాథమిక విచారణ, వ్యతిరేక పక్షంతో కమ్యూనికేషన్, ప్రభుత్వ అధికారంతో సమన్వయం, సంప్రదింపులు మొదలైన వాటితో సహా సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలను తీసుకుంటారు. న్యాయస్థానాలలోని న్యాయ వ్యవస్థతో పోలిస్తే వీరి పద్ధతులు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాదు, తక్కువ సమయాన్ని తీసుకుంటాయి.
న్యాయమూర్తుల కొరత కారణంగా ఒక కేసు సబార్డినేట్ కోర్ట్ నుండి సుప్రీం కోర్ట్ వరకు వెళితే దానికి దాదాపుగా 20 సంవత్సరాలు పట్టవచ్చునని, ఇది ప్రజల్లో నిరాశనే మిగులుస్తుందని తెలిపారు శుభమ్ ఒక్కో కేసుకు సగటున 10 సంవత్సరాల కాల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే, న్యాయస్థానాల్లో న్యాయవాదులు సంవత్సరానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు నిస్సహాయంగా మారడంతో పాటు నిరంతర నిరుత్సాహాన్ని ఎదుర్కొంటారన్నారు.
అధిక నిరక్షరాస్యత, తక్కువ డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులతో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు సహాయం చేయాలనే లక్ష్యంతో, న్యాయకర్త తన ప్లాట్ఫారమ్లో స్థానిక సహాయ-ఆధారిత నమూనాను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. దీనిని ఉపయోగించి, ఎవరైనా వినియోగదారు, ముఖ్యంగా గ్రామీణ , వెనుకబడిన ప్రాంతాల ప్రజలు న్యాయకార్త ద్వారా నియమించబడిన ప్రతినిధులను న్యాయ సహాయం కోసం సంప్రదించవచ్చు.
మే 2020లో తన కార్యకలాపాలను ప్రారంభించిన న్యాయకార్త 2 వారాల్లోనే, న్యాయకార్త ప్రతిరోజూ 100 మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. స్టార్టప్ తన వినియోగదారులకు సమర్థవంతమైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. న్యాయకార్త కార్పొరేట్ టై-అప్లపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. అంతేకాదు ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ స్టార్టప్ కంపెనీ న్యాయకర్త కార్డ్ ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.