Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు చాలా ఈజీగా లభిస్తుంది. అందుకే అరటి పండును తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తినడంలో కూడా చాలామంది ఎన్నో అపోహలను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో చాలామంది అరటిపండు తినకూడదని చెబుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వర్షాకాలం అరటిపండు ఇవ్వకూడదని భావిస్తుంటారు. మరి నిజంగానే వర్షాకాలంలో అరటిపండు తినకూడదా? చిన్నపిల్లలు తింటే ఏమవుతుంది? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే..
అరటి పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండును వర్షాకాలంలో తినడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.వర్షాకాలంలో రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉండటమే కాకుండా గుండె, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే అరటి పండును ఏమాత్రం దూరం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక వర్షాకాలంలో అరటిపండు తినే సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి. వర్షాకాలం రోజుకు ఒక అరటిపండు తినడం చాలా మంచిది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ అరటిపండు తీసుకోవడం మంచిది. రాత్రిపూట తినకపోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును దూరం పెట్టడం మంచిది. అదేవిధంగా కాళీ కడుపుతో అరటిపండు తినకపోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దగ్గు, జలుబు, ఆస్తమా ఉన్నవారు మినహా మిగిలిన వారు ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా అరటిపండు తినవచ్చు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.