Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు చాలా ఈజీగా లభిస్తుంది. అందుకే అరటి పండును తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తినడంలో కూడా చాలామంది ఎన్నో అపోహలను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో చాలామంది అరటిపండు తినకూడదని చెబుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వర్షాకాలం అరటిపండు ఇవ్వకూడదని భావిస్తుంటారు. మరి నిజంగానే వర్షాకాలంలో అరటిపండు తినకూడదా? చిన్నపిల్లలు తింటే ఏమవుతుంది? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే..
అరటి పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండును వర్షాకాలంలో తినడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.వర్షాకాలంలో రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉండటమే కాకుండా గుండె, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే అరటి పండును ఏమాత్రం దూరం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక వర్షాకాలంలో అరటిపండు తినే సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి. వర్షాకాలం రోజుకు ఒక అరటిపండు తినడం చాలా మంచిది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ అరటిపండు తీసుకోవడం మంచిది. రాత్రిపూట తినకపోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును దూరం పెట్టడం మంచిది. అదేవిధంగా కాళీ కడుపుతో అరటిపండు తినకపోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దగ్గు, జలుబు, ఆస్తమా ఉన్నవారు మినహా మిగిలిన వారు ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా అరటిపండు తినవచ్చు.
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
This website uses cookies.