Spirtual: ఈ ప్రపంచంలో మనతో పాటు కోట్లాది మంది ప్రజలు జీవిస్తున్నారు. మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. మనం కూడా అందరితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రయాణంలో, మన ఆలోచనలలో, మన జీవితంలో ప్రతి రోజు ఎంతో మంది భాగం అవుతారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారితో కలిసి మనం ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అన్ని విషయాలకి ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని ముందుకి తీసుకొని వెళ్తున్నాం. ఎవరైనా ఈ భౌతికపరమైన ప్రపంచంలో లక్ష్యాన్ని వెతుక్కుంటూ ముందుకి వెళ్తున్నారు అంటే కచ్చితంగా వారికి ఎంతో మంది సహకారం కచ్చితంగా లభించి ఉంటుంది.
ఈ నా ప్రయాణంలో ఎవరు తనకి సహకరించలేదు. ఈ గెలుపు నా సొంతం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు నాకు నేనుగా వేసినదే. ఇంత వరకు వచ్చానంటే అది నా సామర్ధ్యాన్ని నమ్ముకొని వచ్చాను అన్నారంటే కచ్చితంగా అబద్ధం చెబుతున్నారు అని అర్ధం. ఎందుకంటే ఒక అల్టిమేట్ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకి వెళ్తున్న మన ప్రయాణంలో విజయాన్ని అందుకునే మార్గంలో ఎంతో మంది సహకారం ఎన్నో రకాలుగా ఉంటూనే ఉంటుంది. అయితే దానిని గుర్తుంచడంలో లక్ష్యం సాధించిన మనం వెనుకబడిపోతాం.
ఈ విశ్వంలో ఉన్న ప్రపంచం గురించి అర్ధం చేసుకోవాలంటే సాధారణమైన ఆలోచన సరిపోదు. ఆధ్యాత్మిక అన్వేషణ అవసరం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న మన స్థితిని, ఉనికిని అర్ధం చేసుకోవడానికి మనతో మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఒక్కరు మనకి సహాయం చేయలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువుల దగ్గరకి వెళ్లిన, బాబాలని కలిసిన వారు కూడా ఈ భౌతికపరమైన జగత్తులో మానవ సమాజంతో సంబంధం కలిగి ఉండటం వలన అల్టిమేట్ ఐడెంటిటీ గురించి వారి నుంచి లభించే సహకారం పెద్దగా ఉండదు.
భౌతికపరమైన కోరికలకి, ఆశలపై కారణం అయిన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి. మనల్ని మనం లోతుగా శోధించాలి. అంటే కేవలం మన స్పిరిచ్యువల్ ఐడెంటిటీ కోసం మనతో మాత్రమే మనం ప్రయాణం చేయాలి. ఒంటరిగా మనం ప్రయాణం ఉండాలి. ఒక వేళ ఈ అన్వేషణలో వేరొకరి సహకారం తీసుకుంటే అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత ఆలస్యం అవుతుంది. అందుకే యోగులు, అఘోరాలు, మహర్షులు ఈ జనావాసానికి దూరంగా ఉంటారు.
అలాగే కొంత మంది ఈ ప్రపంచంలో జనంలోనే ఉన్నా కూడా వారిదైనా ప్రపంచంలో ఒంటరిగానే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఒంటరితనం ఈ ప్రపంచం గురించి ఎవరికీ తెలియని సత్యాన్ని తెలియజేస్తుంది. ఒంటరితనం ఈ ప్రపంచంలో ఎవరికి అర్ధం కానీ ఒక తత్వాన్ని ప్రభోధిస్తుంది. అలా ఒంటరితనంతో స్పిరిచ్యువల్ ఐడెంటిటీ పొందిన వారిని చూసుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, పరమహంస యోగానంద, సద్గురు బాబాజీ, షిరిడీ సాయి. ఇలాంటి వారిని ప్రపంచం ఎప్పటికి గుర్తుపెట్టుకోవడానికి కారణం వారు నిజమైన ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నారు.
ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసుకున్నారు. భక్తి వేరు ఆధ్యాత్మిక శక్తి వేరు అనే విషయాన్ని స్పష్టంగా ఈ ప్రపంచంలో ఉన్న వారికి చెప్పే ప్రయత్నం చేశారు. మనతో మనం ఒంటరిగా చేసే ప్రయాణంతోనే నిజమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోగలం.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.